భువనేశ్వరి, పురందేశ్వరి పై రోజా కీలక వ్యాఖ్యలు!

ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో అరెస్టైన చంద్రబాబు చుట్టు ప్రస్తుతం ఏపీ రాజకీయం తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇదే సమయంలో భువనేశ్వరి, పురందేశ్వరిపైనా ఆమె సెటైర్లు పేల్చారు.

తప్పు చేసిన చంద్రబాబు కోసం ఆయన సతీమణి భువనేశ్వరి దేవుడిని వేడుకోవటం ఏంటని ప్రశ్నించిన మంత్రి రోజా… ఎటువంటి ఆధారాలు లేకుండా మాజీ సీఎంను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. అలా చేస్తే కేసు నిలబడదనే విషయం అధికారులకు తెలిల్యదా అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఈ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ తప్పదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్కిల్ డెవలం మెంట్ స్కాంలో ఏపీ సీఐడీ మాత్రమే కాదు.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ జరుపుతుందని గుర్తు చేసిన రోజా… చంద్రబాబు పైన ఆధారాలు లేకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. అనంతరం ఎన్టీఆర్ కుమార్తెలకు ఎటువంటి ఎమోషన్స్ లేవని రోజా వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ కుమార్తెలకు తన తండ్రిని హిసించినా కూడా ఎటువంటి ఎమోషన్స్ లేవని, తండ్రి మీద ప్రేమ లేదని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వరి దేవుడి దగ్గరకు వెళ్లి భర్తను కాపాడమని వేడుకున్నారని.. ప్రజల డబ్బును దోచుకొని మీరు మాత్రం హ్యాపీగా ఉండటం కోసం ప్రజలంతా ప్రార్ధనలు చేయాలా అంటూ ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు.

నాడు ఎన్టీఆర్ ను వేధించిన వ్యక్తికి ఇప్పుడు విధి సమాధానం చెప్పిందని రోజా చెప్పారు. ఇదే సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేయటం పైన ప్రజలు హ్యపీగా ఫీలవుతున్నారని రోజా అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఎన్టీఆర్ కు మనశ్శాంతి దక్కిందని చెప్పుకొచ్చారు!