మరో షాకింగ్ : 50 కోట్లకు పెంచిన రాఖీ సావంత్

షాకింగ్ న్యూస్.. బాలీవుడ్ ఐటమ్ గర్ల్ గా పేరుసంపాదించిన రాఖీ సావంత్ రెచ్చిపోయింది. సినిమాల్లో తరచుగా ఆమె రెచ్చిపోతుంటారు. కానీ ఈసారి ఆమె తన ప్రత్యర్థి మీద విరుచుకుపడింది. ఎవరా ప్రత్యర్థి? ఏంటా కథ? ఆ వివరాలేంటో చదవండి.

బాలీవుడ్ లో మీ టు మూమెంట్ తారల మధ్య చిచ్చు రేపుతున్నది. నిజమైన బాధితులకు మేలు చేకూర్చేలా ప్రయత్నించాల్సిందిపోయి తారలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మీ టూ వ్యవహారాన్ని బయట పెట్టింది తనూశ్రీ దత్తా. నానా పటేకర్ గతంలో ఎప్పుడో తన పట్ల అమర్యాదగా ప్రవర్తించాడని, లైంగిక వేధింపులకు గురి చేశాడని సంచలన ఆరోపణలు గుప్పించింది తనూశ్రీ దత్తా.

ఈ నేపథ్యంలో తనూశ్రీ దత్తా తీరు మీద ఐటమ్ బాంబు రాఖీ సావంత్ నిప్పులు చెరిగింది. తనూశ్రీ దత్తా ఇంతకాలం కోమాలో ఉండి ఇప్పుడే బయటకొచ్చిందని ఎద్దేవా చేసింది. అంతేకాదు. అసలు నానా పటేకర్ అటువంటి వ్యక్తి కాదని ఖితాబిచ్చింది. తనూశ్రీ చేయకుండా వదిలేసిన సాంగ్ లో రాఖీ నటించింది. ఆ సమయంలో తనను కనీసం నానా తాకను కూడా తాకలేదని చెప్పింది.

దీంతో చిర్రెత్తుకొచ్చిన తనూశ్రీ దత్తా రాఖీ సావంత్ కు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. రాఖీ సావంత్ తన మీద అనవసరంగా మాట్లాడి తన పరువుకు భంగం కలిగించినందుకు పది కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించింది. ఈ మేరకు తనూశ్రీ లాయర్లు రాఖీకి పరువునష్టం నోటీసులు కూడా పంపారు.

తనూశ్రీ దత్తాపై రాఖీ మళ్లీ విమర్శలకు దిగింది. ఏమాత్రం తగ్గలేదు. అంతేకాదు తనూశ్రీ 10కోట్లకు పరువునష్టం దావా వేస్తే తాను 50 కోట్లకు పరువు నష్టం దావా ఫైల్ చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. అదే సమయంలో తనూశ్రీ దత్తాపై తీవ్రమైన విమర్శలు గుప్పించింది. నానా పటేకర్, రాజ్ థాక్రే ల నుంచి డబ్బు గుంజాలని తనూ ప్రయత్నించిందని ఆరోపించింది.

వాళ్లిద్దరూ ఖాతరు చేయకపోవడంతో తనను విమర్శించి, తన పేరు వాడుకుని ప్రచారం కొట్టేయాలని తనూ ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పించింది. ఆమె పది కోట్ల పరువు నష్టం దావా వేస్తే ఆమెకు కోర్టులోనే సమాధానం చెబుతానని హెచ్చరించింది. అంతేకాదు తాను 50 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 

మీ టూ సంగతేమో కానీ తారల మధ్య మాత్రం మాటల యుద్ధం తారా స్థాయికి చేరిందని బాలీవుడ్ లో చర్చ సాగుతున్నది. రాఖీ సావంత్ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.