జనసైనికుల నరాలు కట్ అయిపోయే మాటలు చెప్పిన పోసాని!

“ఏమి మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయినియ్” అనేది ముఖ్యంగా ట్రోలింగ్స్ వీడియోల్లో చాలా ఫేమస్ డైలాగ్ అనేది తెలిసిన విషయమే! “నాయక్” సినిమాలో పోసాని చెప్పే ఈ డైలాగ్ ఇప్పటికీ ఫేమస్సే! ఈ సమయంలో తాజాగా పోసాని చెప్పిన మాటలు వింటే.. జనసైనికులు కూడా ఇదే డైలాగ్ వేస్తారేమో అని అంటున్నారు పరిశీలకులు!

అవును… ఏపీలోని వాలంటీర్ల పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న సమయంలో… ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే పవన్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో.. పలు కేసులు సైతం నమోదవుతున్న సందర్భంలో మీడియా ముందుకు వచ్చిన పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో వాలంటీర్లు ఉమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పోసాని… అసలు పవన్ కి “ట్రాఫికింగ్” అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా… ట్రాఫికింగ్ అంటే చెప్పడం ఎందుకు చూపిస్తానంటూ… నారా లోకేష్ విదేశాల్లో అమ్మాయిలతో ఉన్న ఫోటోలను చూపించారు. పలుఇరకాల ప్రదేశాల్లో, పలువురు అమ్మాయిలతో, పలురకాల భంగిమల్లో, పలురకాల దుస్తుల్లో ఉన్న ఆ ఫోటోలను పోసాని ప్రదర్శించారు.

ఈ సందర్భంగా పవన్ ని ఉద్దేశించి స్పందించిన పోసాని… ఈ ఫోటోలు చూసి ఇది శ్రీ కృష్ణుడు గోపికలతో ఉన్న విషయం అనుకునేరు.. ట్రాఫికింగ్ అంటే ఇది అని స్పష్టం చేశారు! ఇదే సమయంలో… ఒకవ్యక్తి ఒకరి నుంచి పార్టీని లాగేసుకుని దీనికి సంబంధించి తీర్పులు అటూ ఇటూ మార్పించి.. అమ్మాయిలను వాడుకున్నారు.. అది ఇట్రఫికింగ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ విషయాలు తెలిసినా కూడా పవన్ కల్యాన్ మాట్లాడడని పోసాని వ్యాఖ్యానించారు. జగన్ రాజకీయ జీవితం నాశనం అయిపోవాలనే ఆశయం తప్ప పవన్ కు మరొకటి లేదని ఈ సందర్భంగా పోసాని స్పష్టం చేశారు. చిరంజీవికి ఉన్న సంస్కారం, పెద్దమనిషి లక్షణాలు పవన్ కు కాస్తైనా లేవని ఈ సందర్భంగా పోసాని స్పందించ్మారు.

అనంతరం పవన్ కల్యాణ్ భీమవరంలో ఎందుకు ఓడిపోయారో చెప్పే ప్రయత్నం చేశారు పోసాని. అవును… పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఒకటైఅన్ భీమవరం నియోజకవర్గంలో ఎందుకు ఓడిపోయాడో తనకు తెలుసు అని పోసాని వ్యాఖ్యానించారు. భీమవరంలో పవన్ ఓటమికి వైఎస్సార్ పార్టీ కారణం కాదని… టీడీపీ వల్లే ఓడిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమారు రూ.15కోట్లు ఇచ్చి పవన్ కి ఓటు వేయకండని చెప్పారని.. పవన్ ఎంక్వైరీ చేసుకోవచ్చని పోసాని అన్నారు.

దీంతో… పవన్ తో పాటు జనసైనికుల నరాలు కట్ అయిపోయే మాట చెప్పారని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!