అమరావతి పునర్ నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు వేదికపై ఉన్న సమయంలో చిన్న నవ్వుల సన్నివేశం విరబూసింది. ముఖ్య నేతలందరూ మాట్లాడటానికి సిద్ధంగా ఉన్న వేళ, మోదీ పవన్ను దగ్గరకు పిలవడం ఒక్కసారిగా అందరిలో ఉత్కంఠ రేకెత్తించింది.
పవన్ కల్యాణ్ ఆ పిలుపుతో వెంటనే లేచి మోదీ వద్దకు చేరుకోగా, ఆయన చేతిలో ఉన్న చాక్లెట్ను పవన్కి అందించేశారు. ఈ క్షణిక సంఘటనపై వేదికపైనే నవ్వులు వెల్లివిరిశాయి. మోదీ, చంద్రబాబు చిరునవ్వులు చిందించగా, పవన్ తన చేతిలో ఉన్న చాక్లెట్ను చూసి స్వయంగా కూడా నవ్వుతూ వారితో కలిసి ఆ హాస్యాన్ని ఆస్వాదించారు.
ఈ దృశ్యం అక్కడున్నవారిని ఆనందంతో ముంచెత్తగా, కొద్ది గంటల్లోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. “మోదీ, పవన్ మధ్య మైత్రి ఎలా ఉందో అర్థమైంది”, “రాజకీయ మాంద్యం మధ్య చిన్న మజిలీ” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అమరావతి సభలో చోటు చేసుకున్న ఈ చిన్న సన్నివేశం సభకు మరో హైలైట్గా మారింది. ఇక పవన్ అంటే మోదీకి ప్రత్యేకమైన అనుభవం ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల విజయం అనంతరం కూడా పవన్ పై పొగడ్తలతో నేషనల్ మీడియాలో ఫోకస్ అయ్యేలా చేశారు.