చంద్ర‌బాబు హెరిటేజ్ కి ప‌వ‌న్ ప్ర‌చారం?

ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పింక్ రీమేక్ తో కంబ్యాక్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. సోమ‌వారం రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా హాజ‌ర‌య్యారు. దానికి సంబంధించిన ఓ ఫోటో కూడా ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అయితే అదే రోజున శాస‌న స‌భలో మూడు రాజ‌ధానుల బిల్లు పెట్ట‌డం జ‌రిగింది. బిల్లుకు వ్య‌తిరేకంగా టీడీపీ నేత‌లు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేసారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం సాయంత్రం ప్ర‌శాంత‌గా ప్రెస్ మీట్ రాజ‌ధాని ఎక్క‌డికి త‌ర‌లి వెళ్ల‌ద‌ని వ్యాఖ్యానించారు. దీంతో ప‌వ‌న్ పై కొంత వ్య‌తిరేక‌త మొద‌లైంది.

రాజ‌ధాని రైతుల‌ను న‌డిసంద్రంలో వ‌దిలేసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలు చేసుకుంటాడా? అంటూ విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతున్నాయి. ఉద‌యం సినిమా షూటింగ్ ల‌కు…సాయంత్రం రాజ‌కీయాల‌కు కాల్షీట్లు కేటాయించావా? ప‌వ‌న్ అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌వ‌న్ ను ఉద్దేశించి నెగిటివ్ కామెంట్ల జోరు ఊపందుకుంది. దీనికి తోడు ప‌వ‌న్ లీక్డ్ పిక్ బ్యాక్ గ్రౌండ్ లో మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ బోర్డ్ పాన్ షాప్ పైన ఉంది. దానికి ముందుగానే ప‌వ‌న్ న‌డుచుకుంటూ వెళ్తున్నాడు. ఇది గ‌మ‌నించిన ఓ వర్గం చంద్రబాబు కంపెనీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ వా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.