అధికారం కోసం పవన్ యాగాలు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా?

954966-pawan-kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో గెలవడానికి కష్టం కంటే అదృష్టాన్ని ఎక్కువగా నమ్ముకుంటున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో విజయం కోసం పవన్ కళ్యాణ్ యాగాలపై దృష్టి పెట్టారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ రాజశ్యామల యాగం చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ యాగం వల్ల పవన్ కు అనుకూల ఫలితాలు వస్తాయేమో చూడాలి.

గతంలో కూడా పలువురు ముఖ్యమంత్రులు ఇదే తరహా యాగాలు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. సినీ హీరోలలో పవన్ కళ్యాణ్ కు దైవ భక్తి ఎక్కువ కాగా ఆ రీజన్ వల్లే పవన్ ఈ తరహా యాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి పవన్ తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. తాను టీడీపీతో పొత్తు పెట్టుకోకపోవడమే చేసిన తప్పు అని పవన్ కు అర్థమైంది.

టీడీపీ కాకుండా ఇతర పార్టీలతో పొత్తు ఉన్నా పెద్దగా ఫలితం ఉండదని పవన్ కళ్యాణ్ కు సైతం తెలుసు. అయితే యాగాలు చేసినంత మాత్రాన అనుకూల ఫలితాలు రావు. ఎంతో కష్టపడితే మాత్రమే అనుకూల ఫలితాలు వస్తాయి. మంత్రాలకు చింతకాలు రాలవనే విషయం పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు. టీడీపీ జనసేన పొత్తు వైసీపీని చిత్తు చేస్తుందో లేక వైసీపీకి అనుకూల ఫలితాలు ఇస్తుందో చూడాలి.

2024లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా భారీ మెజారిటీ వైసీపీకి దక్కదని కొంతమంది చెబుతున్నారు. 2024 ఎన్నికల ఫలితాలలో తెలంగాణలో మార్పు ఉండదని ఏపీలో మాత్రం ఏ పార్టీది అధికారమో చెప్పడం కష్టమని తెలుస్తోంది. 2024 ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగా ఆ సమయానికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.