కౌంటింగ్ హాల్లో పంచాయతీ ఎన్నికల ఏజంట్ మృతి

తెలంగాణ తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో విషాదం జరిగింది. పోలింగ్ సెంటర్లో ఏజంటుగా ఉన్న వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో ఎన్నికల ఏజంటుగా విలాస కవి సత్యం రాజు(70) ఉన్నారు. కౌంటింగ్ జరుగుతుండగానే సత్యం రాజుకు గుండెపోటు వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అతనిని వెంటనే కోదాడ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే అతను చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.