Crime News: కృష్ణా జిల్లాలో దారుణం.. మంత్రి ఊరేగింపులో గుండెపోటుతో మృతి చెందిన సర్పంచ్..!

Crime News:ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 2 రోజుల క్రితం కొత్త మంత్రులను ఎన్నుకొని వారికి శాఖలు కేటాయించారు. ఈ తరుణంలో జోగి రమేష్ కి కూడా మంత్రి పదవి దక్కింది. తమ అభిమాన నాయకుడికి మంత్రి పదవి తగ్గటంతో కార్యకర్తలందరూ ఆనందోత్సాహాలతో పెద్ద ఊరేగింపు చేశారు.

ఈ క్రమంలోగూడూరు మండలం కొకనారాయణ పాలెం గ్రామ సర్పంచ్ బండి రమేష్ రమేష్ కూడా తమ అభిమాన నాయకుడికి మంచి పడితే తగ్గటంతో ఎంతో ఆనందంగా ఊరేగింపులో పాల్గొని సందడి చేశాడు. మంత్రి ఊరేగింపు లో పాల్గొన్న బండి రమేష్ ఆయనకు పూలమాలవేసి ఊరేగింపు తో వస్తుండగా గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే మంత్రి, అతని అనుచరులుబండి రమేష్ ని దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

బండి రమేష్ మరణించాడని తెలియటంతో మంత్రి జోగి రమేష్ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. బండి రమేష్ మరణంతో కొకనారాయణ పాలెం లో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ అభిమాన నాయకుడు మంత్రి అయ్యాడని ఆనందం ఆవిరైపోయింది. బండి రమేష్ మరణంతో కార్యకర్తలు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. బండి రమేష్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ వెల్లడించారు.