వైయస్ పై మరో సినిమా ‘మాట’

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన యాత్ర చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా సానుకూలమైన స్పందన లభిస్తున్నది. ఆనందోబ్రహ్మ ఫేం మహీ వి రాఘవ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రను మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి పోషించారు. దివంగత వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర నేపథ్యంగా రూపొందిన యాత్ర చిత్రం ఫిబ్రవరి 8వ తేదీన రిలీజై మంచి కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో‘మాట’ టైటిల్ తో మరో చిత్రం మొదలైంది.

ఈ చిత్రం కూడా వైయస్ జీవిత విశేషాలతో తెరకెక్కిస్తున్నారు. అమోబా సురేష్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. అశ్విని చిత్రాలయ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం.. వైఎస్‌ఆర్ ప్రజలకు ఇచ్చిన మాట ఏమిటి? దానిని ప్రజలు ఇప్పటికీ ఎలా గుర్తుపెట్టుకున్నారు.. అనే అంశాలతో ఉండబోతోందట. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ టీజర్‌ను కూడా చిత్రయూనిట్ విడుదల చేసింది.

మరో ప్రక్క‘ఎన్టీఆర్’ బయోపిక్‌ను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ఎన్టీఆర్ మహానాయకుడు’ టైటిల్స్‌తో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌‌కు సంబంధించి ఇప్పటికే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రం విడుదలై.. మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ కూడా త్వరలోనే విడుదల కానుంది.