ఏపీలో మరో జాబ్ మేళా.. ఏడాదికి రూ.8.50 లక్షల వేతనం పొందే అవకాశం?

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందించింది. ఈ నెల 28వ తేదీన ఏపీలో జాబ్ మేళా జరగనుంది. జాస్ అలుక్కాస్ సంస్థతో పాటు అపోలో, బైజూస్ మరికొన్ని సంస్థలు ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగులను ఎంపిక చేసుకోనున్నాయి. ఎన్టీఆర్ డిస్టిక్ లో ఈ ఇంటర్వ్యూలూ జరగనున్నాయని సమాచారం అందుతోంది. బైజూస్ సంస్థలో 50 ఖాళీలు ఉండగా 8.5 లక్షల రూపాయల వేతనం లభించనుంది.

అపోలో ఫార్మసీస్, ఇన్నోవ్ సౌర్స్ సర్వీసెస్, జాస్ అలుక్కాస్, టెక్నోటాక్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతర సంస్థలు ఈ జాబ్ మేళాకు హాజరు కానున్నాయి. ఈ జాబ్ మేళా వల్ల నిరుద్యోగులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాల విషయంలో ఆసక్తి ఉన్నవాళ్లు https://docs.google.com/forms/d/e/1faipqlsc9ayiq2y2n-c4lj7ghmbdaymlf_wp57xleo7vsaqcklvqzbw/viewform లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫీస్, విజయవాడలో ఈరోజు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. 9032633548, 8008742842 నంబర్ల ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలుగుతుందని తెలుస్తోంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఇంటర్వ్యూలకు హాజరైతే మంచిదని చెప్పవచ్చు. ఉద్యోగాలకు హాజరయ్యే అభ్యర్థులు సర్టిఫికెట్ల జిరాక్స్ లతో పాటు రెజ్యూమ్ ను కలిగి ఉండాలి. ఫార్మల్ డ్రెస్ లో ఈ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది.