ఏపీలో కొత్త కరోనా … మంత్రి ఆళ్ల నాని కీలక ప్రకటన

కరోనా సెకండ్‌ వేవ్‌ హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. బ్రిటన్‌లో కరోనా కొత్త రకం వైరస్‌ విజృంభణ నేపథ్యంలో విమాన ప్రయాణికుల రాకపోకలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

No New Coronavirus In Andhra Pradesh: Alla Nani - Sakshi

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ఆర్‌టీపీఆర్‌ పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గురువారం మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లభ్యం కాలేదని చెప్పారు. యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఆమె కుమారుడికి పరీక్షలు జరపగా నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపారు. ఆమె ఫస్ట్‌ క్లాస్‌ బోగీలో వచ్చినందున మిగిలిన వారితో కాంటాక్టయ్యే సందర్భాలు తక్కువేనని స్పష్టం చేశారు.

రాజమండ్రిలో కరోనా సోకిన మహిళ నమూనాలను పుణేకు పంపామన్న ఆయన పుణే ల్యాబ్ నుంచి రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్నామని అన్నారు. రాజమండ్రి మహిళ యూకే నుంచి వచ్చారు కాబట్టే అననమానాలు ఉన్నాయని అందుకే ప్రజలెవరూ భయాందోళనలు చెందొద్దని అన్నారు.