Nikhil Siddharth: నా హృదయం ముక్కలైంది.. హీరో సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు

Nikhil Siddharth: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను తగ్గించిన తర్వాత వారం వ్యవధిలో సుమారుగా 170 థియేటర్లు మూతపడ్డాయన్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం పై నాని చేసిన కామెంట్స్ హీటేక్కిస్తున్న నేపథ్యంలో ఏపీ లోని అధికార యంత్రాంగం థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండగా పులువురు సినీ ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులు డైలమాలో పడ్డారు. ఇటువంటి సందర్భంలో థియేటర్లను నడిపించేందుకు ఎగ్జిబిటర్లు ఆసక్తి కనపరచడం లేదు.

తాజాగా విడుదల అయిన శ్యామ్ సింగ్ రాయ్, పుష్ప, అఖండ మూవీల పైన బోలెడు ఆశలు పెట్టుకున్న ఎగ్జిబిటర్ల ఆశలు అడియాసలే అయ్యాయి. అయితే తాజాగా ఈ విషయంపైన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్లు మూతపడటంతో తన హృదయం ముక్కలైందని తెలిపాడు. తెలుగు సినీ పరిశ్రమకు మద్దతుగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేసాడు సిద్ధార్థ్. కొన్ని సంచలన నిర్ణయాల వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదుర్కుంటున్న సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఈ యంగ్ హీరో కోరాడు.