టీడీపీ నేతలు నిజాయితీపరులు వైసీపీ నేతలు చెడ్డవాళ్లా.. బాబు మారడా?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెలుగు రాష్ట్రాల్లో అభిమానించే అభిమానులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఆయన వల్లే అభివృద్ధి జరిగిందని నమ్మేవాళ్లు సైతం ఎక్కువమందే ఉన్నారు. అయితే చంద్రబాబు తన గురించి తాను గొప్పగా చెప్పుకునే మాటలు కొంతమందికి మాత్రం నవ్వు తెప్పిస్తున్నాయి. తాజాగా చంద్రబాబు గోరంట్ల మాధవ్ ఘటన గురించి గోరంట్ల మాధవ్ ను పార్టీ నుంచి డిస్మిస్ చేయాలని కామెంట్లు చేశారు.

ఇలాంటి పనులు చేసేవాళ్లను సీఎం జగన్ వెనకేసుకుని వస్తున్నాడని బాబు అభిప్రాయపడ్డారు. అయితే ఎంపీ అయిన గోరంట్ల మాధవ్ ను డిస్మిస్ చేయాలని కోరడంలో ఏ మాత్రం తప్పు లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు తనకు తానుగా ఎలాంటి శిక్షను విధించుకున్నారని నెటిజన్ల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు హయాంలో జరిగిన ఘటనల గురించి కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

గతంలో టీడీపీ ఎమ్మెల్యే ఒక అధికారిణి విషయంలో దారుణంగా వ్యవహరించగా ఆ ఎమ్మెల్యేపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బెజవాడకు చెందిన ఒక ఎమ్మెల్యే వల్ల పలువురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. కాల్ మనీ నిందితుల విషయంలో కూడా చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే సంగతి తెలిసిందే. గోరంట్ల మాధవ్ తప్పు చేశారో కరెక్ట్ చేశారో తెలియడానికి ఎంతో సమయం పట్టదు.

గోరంట్ల మాధవ్ తప్పు చేశారని తేలిన తర్వాత కూడా వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఎవరూ సమర్థించరనే సంగతి తెలిసిందే. టీడీపీ నేతలలో ఎవరూ తప్పు చేయలేదనే విధంగా చంద్రబాబు మాటలు ఉండటం ఏపీ ప్రజలకు సైతం నవ్వు తెప్పిస్తోంది. టీడీపీకి 2024 ఎన్నికల్లో కూడా 2019 ఫలితాలే రిపీట్ అయితే మాత్రం టీడీపీకి భవిష్యత్తు ఉండదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.