రోజాగారు గమనిస్తున్నారా.. అలాంటి వాళ్లతో విమర్శలు అవసరమా?

వైసీపీ నేత, సినీ నటి రోజా సాధారణంగా ఇతరులపై విమర్శలు చేయడానికి ఇష్టపడరు. అయితే రోజా విమర్శలు చేస్తే మాత్రం ఒకింత ఘాటుగానే విమర్శలు చేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. తాజాగా రోజా చిరంజీవిపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ విమర్శలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. చివరకు గెటప్ శ్రీను సైతం రోజాపై విమర్శలు చేస్తుండటం గమనార్హం.

అయితే జరుగుతున్న పరిణామాలను రోజాగారు గమనిస్తే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ మెప్పు పొందడం కోసం ప్రజల మెప్పు పొందకుండా వ్యవహరించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. రోజాకు కూడా ఈ విషయం తెలియదని చెప్పలేం. చిరంజీవి గొప్పదనాన్ని తగ్గించేలా కామెంట్లు చేస్తే ఫ్యాన్స్ అస్సలు సహించరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనే సంగతి తెలిసిందే. గెటప్ శ్రీను తన పోస్ట్ లో చిరంజీవి సేవా గుణం తెరిచిన పుస్తకం అని పేర్కొన్నారు.

చిరంజీవి సేవా గుణం, దాన గుణం రోజాకు ఎందుకు కనపడలేదో తెలియదని రోజాగారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి. రోజా ఉనికి కోసం విమర్శలు చేసి ప్రజల్లో గౌరవాన్ని కోల్పోవద్దని మీ నోటి నుంచి పచ్చి అబద్ధాలను వినాలని అనుకోవడం లేదని గెటప్ శ్రీను చెప్పుకొచ్చారు. నాగబాబు రోజా కామెంట్ల గురించి స్పందిస్తూ రోజా నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి తేడా లేదని కామెంట్లు చేశారు.

రోజా పర్యాటక శాఖను ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలుసుకోవాలంటూ నాగబాబు సెటైర్లు వేశారు. నాగబాబు వేసిన సెటైర్లు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. నాగబాబు చేసిన కామెంట్ల గురించి రోజా ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కామెంట్ల గురించి జోరుగా చర్చ జరుగుతోంది.