జగన్ సర్కార్ పెట్టిన కేసు తప్పని ప్రూవ్ అయిందిగా.. ఇప్పుడేం చేస్తారో?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ చేసిన తప్పును ప్రస్తుతం నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. సొంత కానిస్టేబుల్ ను డిస్మిస్ చేయడానికి జగన్ సర్కార్ చూపిన అత్యుత్సాహం విమర్శలకు తావిస్తోంది. ఎవరైతే ఫిర్యాదు చేశారని చెబుతున్నారో ఆ మహిళే ఆ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదని చెబుతుండటం గమనార్హం. ఇప్పుడు జగన్ సర్కార్ ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.

ఈ విషయంలో ఎస్పీ ఫక్కీరప్పపై కూడా కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. భాను ప్రకాశ్ ను ఈ కేసులో బలిపశువును చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు మేలు జరగడం కోసమే ప్రకాశ్ కష్టపడ్డాడని అలాంటి వ్యక్తి విషయంలో జగన్ సర్కార్ కఠినంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆరోపణలు ఉన్న ఎంతోమంది పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

నిజాయితీపరులైన పోలీసుల విషయంలో జగన్ సర్కార్, పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ పరోక్షంగా భాను ప్రకాశ్ ను డిస్మిస్ చేసిన కేసు తప్పని ప్రూవ్ అయిందని అతనిని విధుల్లోకి తీసుకోవాలని చాలామంది కోరుతున్నారు. చంద్రబాబు కూడా భాను ప్రకాశ్ కు డిస్మిస్ విషయంలో అండగా నిలబడతామని వెల్లడించారు.

చిన్న ఉద్యోగుల విషయంలో జగన్ సర్కార్ కఠినంగా వ్యవహరించడం ఆ పార్టీ అభిమానులకే నచ్చడం లేదు. ప్రభుత్వం అన్ని వర్గాలకు మంచి చేసే దిశగా అడుగులు వేయాలే తప్ప ఇబ్బందులు సృష్టించే విధంగా అడుగులు వేయడం మంచిది కాదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళ కామెంట్ల విషయంలో జగన్ సర్కార్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.