పార్టీ నేతలతో ఇపుడు తిట్టిస్తున్నారా ?

చంద్రబాబునాయుడు గేమ్ ప్లాన్ అంతా ఇలాగే ఉంటుంది. నలుగురు రాజ్య సభ సభ్యులు పార్టీ ఫిరాయింపు వెనుక చంద్రబాబు గేమ్ ప్లానే ఉందన్న విషయం బాగా ప్రచారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎంపిల ఫిరాయింపుపై విదేశాల్లో ఉన్న చంద్రబాబు మాట్లాడుతూ వ్యక్తిగత అజెండాతోనే ఎంపిలు పార్టీలు మారినట్లు మొక్కుబడి ప్రకటన చేసి చేతులు దులిపేసుకున్నారు.

చంద్రబాబు ప్రకటన చూసిన తర్వాత పార్టీ అధ్యక్షుడి అనుమతితోనే ఎంపిలు బిజెపిలోకి ఫిరాయించారనే విషయాన్ని నేతలు కన్ఫర్మ్ చేసుకున్నారు. దాంతో విషయం బయటపడిపోవటంతో చంద్రబాబు ఆలస్యంగా మేలుకొన్నారు. వెంటనే ఫిరాయించిన ఎంపిలను పార్టీ నేతలతో తిట్టించే ప్రోగ్రామ్ షురూ చేశారు.

గుంటూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లోని నేతలకు టైం టేబుల్ ఇచ్చి మరీ ఫిరాయింపు ఎంపిలను తిట్టిచ్చే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. అంటే తనను ఎవరూ వేలెత్తి చూపకుండా చంద్రబాబు చేసుకున్న ఏర్పాటన్నమాట.  ఫిరాయింపులపై చంద్రబాబు మాట్లడకపోయినా, నేతలతో తిట్టించినా జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది.