స్వార్ధం కోసం ప్రజలను లాగుతున్నారు

చంద్రబాబునాయుడు బాధ ప్రజల బాధ అయిపోయింది. కరకట్టపై చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమనిర్మాణమని, దాన్ని కల్చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే తన మీద కోపంతోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 74 వేల నిర్మాణాలను కూల్చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కూల్చేసేందుకు రెడీ అయ్యారని ఆరోపిస్తున్నారు.

కరకట్ట మీద నిర్మించిన అక్రమనిర్మాణానికి రాష్ట్రంలోని 74 వేల అక్రమనిర్మాణాలకు ఏమీ సంబంధం లేదు.  మామూలు జనాలు తమ ఇంటికి కొద్దిపాటి నిబంధనలు ఉల్లంఘించటానికి సిఎంగా ఉన్నపుడు చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేయటానికి పోలికే లేదు.

పైగా కరకట్ట మీదున్న అక్రమనిర్మాణాలతో కృష్ణానది ప్రవాహానికి ఇబ్బందులు వస్తాయని, అక్రమనిర్మాణాల వల్ల విజయవాడ ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని జగన్ పదే పదే చెబుతున్నా చంద్రబాబులో మార్పు రావటం లేదు. పైగా  తన సమస్యను రాష్ట్రం మొత్తానికి పులమటానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.

కరకట్ట మీద ప్రజావేదికను కూల్చేసినా మామూలు జనాలకు ఏమీ సంబంధం లేదు. అలాగే లింగమనేని గెస్ట్ హౌస్ ను కూల్చేసినా జనాలకు వచ్చే ఇబ్బందేమీ ఉండదు. కానీ తానుంటున్నది అక్రమనిర్మాణామని తెలిసి కూడా దాన్ని ఖాళీ చేయకుండా అక్కడే ఉండటానికి ప్రయత్నిస్తుండటమే విచిత్రంగా ఉంది.