జనసేనలో చేరిన నాగబాబు… నరసాపురం నుంచి ఎంపీగా బరిలోకి

పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు జనసేన పార్టీలో బుధవారం చేరారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాగబాబుకు కండువా కప్పి పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పవన్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…

“ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తన సోదరుడు నాగబాబును దొడ్డి దారిన కాకుండా నేరుగా ప్రజా క్షేత్రంలో నిలబెడుతున్నాను. నాగబాబును రాజమార్గంలో రాజకీయాల్లోకి తీసుకొస్తున్నాను. ఆయన అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి. రాజకీయాల పై స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే నరసాపురం లోక్ సభ నుంచి జనసేన తరపున పోటికి దింపుతున్నాను. ఆయనకు మనస్పూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం.” అని పవన్ అన్నారు.