నాగబాబు నుంచి మళ్లీ వీడియో..ఈ సారి మ్యాటర్ ఏంటంటే

నా ఛానెల్ నా ఇష్టం అంటూ వరసపెట్టి వీడియోలు చేస్తూ వస్తున్న నాగబాబు ఎలక్షన్ రిజల్ట్స్ అనంతరం మళ్లీ వీడియోతో ప్రత్యక్ష్యమయ్యారు. అంతకు ముందు బాలకృష్ణను, వైయస్ జగన్ ని వెటరారం చేస్తూ వీడియో చేసిన ఈయన ఈ సారి కంటెంట్ మార్చారు. మొదట అధిక మెజారిటీ తో గెలిచిన వైయస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ప్రకటించిన నవరత్నాలు అమలు చేయాలని కోరారు.

https://www.youtube.com/watch?time_continue=207&v=j_4m09r2CDA

అలాగే జనసేన పార్టీ ఒక స్దానం మినహా ఎక్కడా గెలవకపోవటంతో ఆ నిరాశ,బాధ తమకూ ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. జనసైనికులు ఎవరూ నిరాశపడద్దని ధైర్యం చెప్పారు. తాము డబ్బు ఖర్చు పెట్టకుండా గెలవాలనుకున్నామనే విషయం గుర్తు చేసారు. క్లీన్ పాలిటిక్స్ చేద్దామని వచ్చామని అదే చేసామని,గెలుపు , ఓటమిలు చూసుకోకుండా ముందు వెళ్లాలని సూచించారు.

అయితే తమకు పడిన లక్షలాది ఓట్లు జనం మార్పు కోరుకుంటున్నారు అనటానికి సాక్ష్యం అని తేల్చి చెప్పారు. మనం టెక్నికల్ గా గెలవక పోవచ్చు కానీ నైతికంగా గెలిచామని అన్నారు. జనసైనికుల ఎఫెర్ట్ మాత్రం చాలా గొప్పదని కొనియాడారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.