పవన్ – రోజా.. మధ్యలో సన్నీలియోన్!

పవన్ ని ఉతకడం మొదలుపెడితే తనకంటే బాగా ఎవరూ ఉతకలేరన్నట్లుగా చెలరేగిపోతారనే పేరున్న మంత్రి ఆర్కే రోజా… మరోసారి నిప్పులు చెరిగారు. అటు చంద్రబాబుని, ఇటు పవన్ కి కలిపి వాయించేశారు. ఈ సందర్భంగా తెరపైకి సన్నీ లియోన్ ని తేవడం గమనార్హం.

అవును… తాజాగా పవన్ పై ఫైరయిన రోజా కొన్ని కీలక కామెంట్లు చేశారు. అందులో ముఖ్యంగా… కరోనా టైంలో ఏపీలో ప్రజలకు సేవలందించింది వాలంటీర్లే అని గుర్తు చేసిన రోజా… ఆ టైం లో చంద్రబాబు, పవన్ లు హైదరాబాద్ లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో పవన్ సభల్లో వాలంటీర్లపై విమర్శలు చేస్తుంటే… ముందునుంచుని విజిల్స్ వేస్తూ, చప్పట్లు కొడుతున్న వారి అనుచరులు కూడా వాలంటీర్ల సేవలు అందుకున్నవారేనని అన్నారు రోజా. ఈ సందర్భంగా… చంద్రబాబు పూనిన చంద్రముఖిలాగా పవన్ కల్యాణ్ పిచ్చి గంతులు వేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

అదేవిధంగా… అసలు పవన్ తల్లి గురించి గానీ, పెళ్లాం గురించి గానీ ఎవరు తప్పుగా మాట్లాడారని ప్రశ్నించిన మంత్రి రోజా… పవన్ నీతులు మాట్లాడితే సన్నీలియోన్ వేదాలు వల్లించినట్టుగా ఉంటుందన్నారు. అనంతరం పనికిమాలిన పీకే జాగ్రత్తగా మాట్లాడాలని రోజా తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ఇదే క్రమంలో… సంస్కారం గురించి మాట్లాడే అర్హత పవన్ కి ఎక్కడిదని ప్రశ్నించిన మంత్రి… పవన్ పనికిమాలినోడని, ఆయన మాటలు వింటే లాగిపెట్టి కొట్టాలనిపిస్తోందని చికాకు పడ్డారు! ఇప్పుడు సేవలు చేస్తున్న వాలంటీర్లపై బురద జల్లుతున్న పవన్… నాడు జన్మభూమి కమిటీల విషయంలో ఏమైపోయారని ఆమె అన్నారు.

అవును… జన్మభూమి కమిటీలతో చంద్రబాబు ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేసినప్పుడు పవన్ ఏమైపోయారని నిలదీసిన రోజా… అప్పుడు పవన్ నోరు ఎందుకు తెరవలేదని ప్రశ్నించారు. అప్పుడు పవన్ తన నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నాడా అంటూ మండిపడ్డారు.

ఇదే క్రమంలో సచివాలయ వ్యవస్థ గురించి పవన్ కల్యాణ్ కి తెలియదని, తెలిసే ఛాన్స్ లేదని చెప్పిన ఆమె… శాసనసభకు వచ్చి ఉంటే ఆ చట్టం గురించి తెలిసి ఉండేదని ఎద్దేవా చేశారు. రెండు చోట్లా ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేసి గిల్లినట్లున్నారు.

ఫైనల్ గా… చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మాత్రమే పవన్ కి వచ్చని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి!