MLA Roja: చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్..

MLA Roja: ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇక పార్టీల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే రోజా టీడీపీ సభ్యులపై మండిపడింది. చంద్రబాబు ఇచ్చిన పచ్చకార్డులను పట్టుకొని ఇక్కడ సోదరులు ఆందోళన చేస్తున్నారని.. అందులో ఏముందో అర్థమవ్వటంతో వాటిని చించేస్తున్నారని తెలిపింది.

అక్కడ బెల్టు షాపులు మూసేస్తానని గతంలో హామీ ఇచ్చాడని.. కానీ ఇప్పటికీ 40 వేలకు పైగా బెల్టుషాపులు తెరిచారని.. మద్యం సిండికేట్లతో ఆడవారి పసుపుకుంకుమలతో చెలగాటమాడారని తెలిపింది. అందుకే ప్రతి మహిళ ఆ ప్రభుత్వాన్ని ఛీ కొట్టిందని.. ఇంటింటికి మినరల్ వాటర్ బదులు క్వార్టర్ బాటిల్ ఇచ్చారని మండిపడింది. పాఠశాలలకు బదులు మద్యం షాపులను తెరిచింది అంటూ.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎనీ టైం మందు దొరికేది అంటూ.. మరిన్ని వ్యాఖ్యలను చేస్తూ ఫైర్ అయ్యింది.