పవన్ కు సిగ్గులేదు… మోడీకి గుర్తుంది!

రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచీ పవన్ కల్యాణ్ వ్యవహార సరళి మీద మంత్రి రోజా తరచుగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఉంటారనేది తెలిసినా విషయమే. లాజిక్కులు లాగుతూనే.. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెబుతూనే.. కాస్తగట్టిగానే వాయిస్తుంటారు.. ప్రశ్నిస్తుంటారు. ఇందులో భాగంగా తాజాగా మరోమారు మైకులముందుకు వచ్చారు మంత్రి రోజా.

అవును.. పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి ఎన్ డీయే కూటమి సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా… టీడీపీ – బీఇజేపీ – జనసేన కలిసే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాయనే హింట్ ఇచ్చిన సంగతీ తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంపై రోజా స్పందించారు. పవన్‌ కల్యాణ్‌ దళపతి కాదు.. దళారి అంటూ ఫైరయ్యారు. చంద్రబాబు కోసమే పవన్‌ ఢిల్లీలో దళారిగా మారాడని ఎద్దేవా చేశారు.

తన తల్లిని తిట్టినవాడి కోసం పవన్‌ కల్యాణ్‌ దళారిగా మారడం సిగ్గుచేటని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించిన రోజా… కాపులు, కార్యకర్తలకు పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పైగా… సిగ్గులేకుండా మూడు పార్టీలతో కలిసి పోటీచేస్తామని అంటున్నాడని విమర్శించాడు. ఇదే క్రమంలో… మోడీని తిడితే అది ఆయన గుర్తుంచుకున్నాడు కానీ… పవన్ తల్లిని తిడితే మాత్రం ఈయన మరిచిపోయాడ్దని రోజా గుర్తుచేశారు.

2014లో పొత్తుపెట్టుకుని, అనంతరం అవసరం తీరాక ప్రధాని మోడీని తిట్టిన చంద్రబాబుని ఎన్డీయే సమావేశానికి పిలవలేదని.. మోడీకి తనను తిట్టిన విషయం గుర్తుందని రోజా అన్నారు. కానీ, తన తల్లిని చంద్రబాబు తిట్టించిన విషయం మాత్రం పవన్ మరిచిపోయాడని.. పైగా చంద్రబాబు కోసం హస్తినలో దళారి వేషం వేశాడని ఎద్దేవా చేశారు.

ఇదే క్రమంలో… పవన్‌ మీడియా ముందు హీరో.. రాజకీయాల్లో జీరో అని ఎద్దేవా చేసిన రోజా… ఆనాడు ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోను.. గొంతు కోసుకుంటా అని చెప్పుకుని, ఇప్పుడేమో పొత్తుల కోసం సిగ్గులేకుండా అందరి కాళ్లు పట్టుకుంటున్నాడని తీవ్రస్థాయిలో విమర్శించాడు. ఇదే సమయంలో సినిమాల్లో ఎవరో రాసే స్క్రిప్టులు చదివే అలవాటు ఉన్న పవన్ కల్యాణ్.. రాజకీయాల్లో చంద్రబాబునాయుడు రాసిచ్చే స్క్రిప్టులు చదువుతూ బతికేస్తుంటారని రోజా ఫైరయ్యారు.

ఇక నీతి ఆయోగ్ లాంటి విషయాల గురించి అడిగినప్పుడు.. “ఆ విషయం మీద నాకు పెద్ద అవగాహన లేదు, దాని గురించి మా నాదెండ్ల మనోహర్ మాట్లాడతారు” అని సిగ్గులేకుండా చెప్తారని రోజా ఎద్దేవా చేశారు. ఆ మాత్రం అవగాహన లేని వ్యక్తి నాయకుడిగా పనికిరారని రోజా చెప్పుకొచ్చారు. “మరెందుకు నువ్వు పార్టీపెట్టింది.. గాడిదలు కాయడానికా” అంటూ మంత్రి రోజా పవన్ ను తీవ్రస్వరంతో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి!