మంత్రికి టిడిపి ఎంఎల్సీ సన్మానం ?

మంత్రైన తర్వాత జిల్లాలో తిరుగుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చాలా చోట్ల సన్మానాలు చేస్తున్నారు. జిల్లాలో తిరుగుతూ పెద్దిరెడ్డి ఆదివారం చిత్తూరుకు చేరుకున్నారు. ఆదివారం చిత్తూరులో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సమావేశం జరిగింది.  

సర్వసభ్య సమావేశం సందర్భంగా పెద్దిరెడ్డికి సన్మానం చేసేందుకు టిడిపి ఎంఎల్సీ దొరబాబు వేదిక మీదకు వచ్చారు. అయితే మంత్రి దాన్ని సున్నితంగా తిరస్కరించారు. నిజానికి పెద్దిరెడ్డికి దొరబాబుకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది. కాకపోతే ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు కాబట్టి కలవటం, మాట్లాడుకోవటం తక్కువనే చెప్పాలి.

అయితే ప్రస్తుతం మంత్రి అయిన పెద్దిరెడ్డిని సన్మానించాలని దొరబాబుకు ఎందుకు అనిపించిందో ఏమో. అనిపించిన వెంటనే పెద్ద శాలువా తీసుకుని వేదిక మీదకొచ్చేశారు. అయితే శాలువ కప్పుకోవటానికి పెద్దిరెడ్డి తిరస్కరించటంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.  దొరబాబుతో సన్మానం చేయించుకోవటం ఇష్టం లేకే పెద్దిరెడ్డి సన్మానాన్ని తిరస్కరించారని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. మరి వాస్తవం ఏమిటో పెద్దిరెడ్డే చెప్పాలి.