మళ్ళీ రెచ్చిపోయిన నారా లోకేష్: సంచలన ట్వీట్స్

జగన్ దాడి ఘటనపై ఇప్పటికే లోకేష్ చేసిన పలు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్ మోడీ రెడ్డి అంటూ జగన్ కి కొత్త పేరు పెట్టారు లోకేష్. ఇప్పుడు టీడీపీ అభిమానులంతా అదే పేరుతో జగన్ ని పిలవడం మొదలెట్టేశారు. ఆ హడావిడి తగ్గకముందే లోకేష్ మళ్ళీ సంచలన ట్వీట్స్ పెట్టారు. ఆ ట్వీట్స్ వివరాలేంటో కింద ఉన్నాయి చదవండి.

కుట్రలను బయటపెడితే మీ అంతు చూస్తా అని పోలీసులకు బెదిరింపులు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, రాష్ట్ర వ్యవస్థలపై నమ్మకం లేదంటూ రాష్ట్ర ప్రజలను కించపరిచే విధంగా జగన్ మోడీ రెడ్డి మాట్లాడటం దారుణం. # జగన్నాటకం.

అడ్డంగా దొరికిపోయాక కూడా ఏ 1 ముద్దాయి జగన్ మోడీ రెడ్డి దొంగ, దొంగ అని అరుస్తున్నారు. అవినీతి పునాదులపైనా వెలసిన దొంగ పేపర్, ఛానల్ లో డబ్బా కొట్టుకున్నంత మాత్రాన కోడి కత్తి డ్రామా వెనుక ఉన్న నిజం మారదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థలను, అధికారులను కించపరుస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్న జగన్ మోడీ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారు. # జగన్నాటకం.

ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ చేస్తే కోడి కత్తి డ్రామా వెనుక ఉన్న నిజాలు బయటపడతాయని జగన్ మోడీ రెడ్డికి భయం పట్టుకుంది. కేంద్రం నిర్వీర్యం చేసిన మోడీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నాటకాన్ని రక్తి కట్టించి, టీడీపీపై నిండా వెయ్యాలని జగన్ కలలు కంటున్నారు.