ఆయన బలవంతం వల్లే పవన్ పార్టీ పెట్టారా.. లక్ష్మీపార్వతి కామెంట్లు నిజమేనా?

టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శలు చేసే విషయంలో లక్ష్మీపార్వతి ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా లక్ష్మీపార్వతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నారా లోకేశ్ పాదయాత్ర వల్ల ఎలాంటి లాభం లేదని తెలిపారు. బాలయ్య తనను అన్ స్టాపబుల్ షోకు పిలిస్తే వెళ్లడానికి తాను సిద్ధమేనని ఆమె చెప్పుకొచ్చారు. అన్ స్టాపబుల్ షో ద్వారా చంద్రబాబు ఎన్టీఆర్ కు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చారని లక్ష్మీపార్వతి అభిప్రాయం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఏం చెప్పినా వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలుసని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజమైన నందమూరి అంటే తాను మాత్రమేనని లక్ష్మీ పార్వతి వెల్లడించారు. చంద్రబాబు ఎన్టీఆర్ ను ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో అందరికీ తెలుసని ఎన్టీఆర్ తన ఆస్తులను 1982 సంవత్సరం సమయంలోనే కొడుకులు, కూతుళ్ల పేర్లపై రాశాడని లక్ష్మీపార్వతి కామెంట్లు చేశారు.

నందమూరి తారకరత్న కుటుంబాన్ని తాను ఫోన్ లో పరామర్శించానని ఆమె చెప్పుకొచ్చారు. నందమూరి ఫ్యామిలీలో మంచి వ్యక్తి బాలయ్య మాత్రమేనని లక్ష్మీపార్వతి అభిప్రాయం వ్యక్తం చేశారు. లోకేశ్ అల్ప జంతువు అని ఆమె పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంలోకి వచ్చినా లాభం లేదని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. చంద్రబాబు పవన్ తో జనసేన పెట్టించారని ఆమె కామెంట్లు చేశారు.

పవన్ జనసేన పార్టీని బలోపేతం చేయలేదని ఈ విషయాలను తాను గమనించాలని లక్ష్మీపార్వతి అన్నారు. వారాహి వాహనాన్ని మూవీ షూటింగ్స్ కోసం వాడుతున్నారని ఆమె కామెంట్లు చేశారు. లక్ష్మీ పార్వతి చేసిన సంచలన వ్యాఖ్యల గురించి చంద్రబాబు, పవన్, ఎన్టీఆర్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.