రామోజీ కాళ్లు పట్టుకున్న నందమూరి లక్ష్మీపార్వతి!

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఒక లేఖ సంచలనంగా మారింది. ఆర్బీఐ రూల్స్ కు వ్యతిరేకంగా నడిపారంటూ… మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో కోర్టు విచారణను ఎదుర్కోంటున్న చెరుకూరి రామోజీరావు కు ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడ‌మీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ఎన్నో విషయాలు ప్రస్థావించారు. అయితే వాటిలో… “ఆమె రామోజీరావు కాళ్లు పట్టుకుని బ్రతిమాలిన విషయాన్ని, ఆ సమయంలో ఎన్టీఆర్ చెప్పిన మాట”ను హైలైట్ చేస్తున్నారు నెటిజన్లు!

ఎన్టీఆర్ ని పదవీచ్యుతుడ్ని చేసే ఎపిసోడ్ అది! అప్పటికే రామోజీ సహాయంతో చంద్రబాబు పూర్తిగా స్కెచ్ గీసేసుకున్నారు. ఇక తమ తండ్రి జీవితం పతనమైపోతున్న విషయంలో తలో చెయ్యీ వేయ్యడానికి నందమూరి వారసులు మెంటల్ గా రెడీ అయిపోయారు. ఈ సమయంలో ఎన్టీఆర్‌ ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లారంట రామోజీరావు. పరామర్శ అనంతరం వెనుదిరిగిన సంద‌ర్భంలో ల‌క్ష్మీపార్వతి ఆయ‌న్ను వేడుకున్నారట.

“మీరు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని సాగనంపటానికి బయటకు వచ్చిన నేను మీ కాళ్ళు పట్టుకుని ఏడ్చాను. అన్నా… ఆయన ఆరోగ్యం బాగుండటం లేదు. ఈ సమయంలో ఇంతటి అవమానాన్ని ఆయన తట్టుకోగలరా.? మీరొక్కరే కాపాడగలరు. మీరు చంద్రబాబుకి చెప్పి ఎన్టీఆర్‌ ను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగనివ్వండి. నా వ‌ల్ల‌ ఏ ఇబ్బంది లేదండీ” అంటూ ఒక చెల్లెలిగా భోరున ఏడ్చారంట లక్ష్మీపార్వతి.

ఆ సమయంలో ఆమెను పక్కకు తోసేసిన రామోజీ ముందుకు కదిలిన అనంతర లేచి వచ్చిన పెద్దాయన… “లక్ష్మీ… పులి చంపేస్తుందని కుందేలు వెళ్లి సింహాన్ని ఆశ్రయించింద‌ట‌. అలా ఉంది నువ్వు ఇతన్ని వేడుకోవటం. ఇదంతా ఇతడి వల్లనే కదా జరిగింది. నా కుటుంబ సభ్యుల్ని నా నుండి దూరం చేసి పట్టం కట్టింది ఎవరు? అంతా తెలిసి మళ్ళీ వాడి కాళ్ళు ఎందుకు పట్టుకుంటావ్?.. ఇలాంటి సిగ్గుమాలిన పని ఎప్పుడూ చేయకు. ఇదంతా మనం ప్రజల్లోనే తేల్చుకుందాం” అని అన్నారంట.

ప్రస్తుతం ఈ విషయాలు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారుతున్నాయి. రామోజీ అంత కర్కసుడా.. చంద్రబాబుతో కలిసి అంత దుర్మార్గానికి దిగజారాడా.. అన్నగారి భార్య కాళ్లు పట్టుకున్నా కరగలేదా… అని గత ఎపిసోడ్ గురుంచి పూర్తిగా తెలియని జనం, జనరేషన్ చర్చించుకుంటున్నారు. దీంతో… తాజాగా మంచమెక్కిన రామోజీ ఫోటోలను షేర్ చేస్తూ… “పైన భగవంతుడు ఉన్నాడు” అంటూ కామెంట్లు పెడుతున్నారు అన్నగారి “అసలు సిసలు అభిమానులు”!