కృష్ణా జిల్లాలో మునిగిన బల్లకట్టు

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో పెద్ద ప్రమాదం తప్పింది. గుడిమెట్లలో బల్లకట్టు మునిగింది. ప్రమాద సమయంలో బల్లకట్టు పై లారీ, కారు మరియు పలు వాహనాలు ఉన్నాయి. వాటితో పాటు 20 మంది ఉన్నారు. బల్లకట్టు మునిగిన వెంటనే అక్కడే ఉన్న ఇతరులు స్పందించి 20 మందిని కాపాడారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు జిల్లా పుట్లగూడెం నుంచి కృష్ణా జిల్లా రామన్నపేటకు వెళుతుండగా ప్రమాదం జరిగింది.