ఫైర్ బ్రాండ్ కు పెద్ద షాక్

వైసిపిలో ఫైర్ బ్రాండ్ గా పాపులరైన ఆర్కె రోజా కు జగన్మోన్ రెడ్డి పెద్ద షాకే ఇచ్చారు. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా తనకు స్ధానం కచ్చితంగా ఉంటుందని రోజా బలంగా నమ్మారు. దానికి తోడు సోషల్ మీడియా, మీడియాలో కూడా మంత్రివర్గంలో  రోజాకు కీలక శాఖ అంటూ ఒకటే ఊదరగొట్టారు. దాంతో తాను మంత్రిగా రోజా మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు.

తీరా మంత్రివర్గంలోకి తీసుకోబోయే వారికి ఫోన్లు చేసి అందుబాటులో ఉండాల్సిందిగా చాలామందికి చెబుతున్నారు. అలా ఫోన్లు అందుకున్న వారిలో  రోజా పేరు లేకపోవటంతో పెద్ద షాక్ తగిలినట్లే అయ్యింది. కాబోయే మంత్రిగా ప్రచారం అయిన నేపధ్యంలో ఇపుడు మంత్రిగా అవకాశం లేదంటే రోజాకు ఇబ్బందికరమనే చెప్పాలి.

రోజాకు మంత్రిపదవి ఇవ్వలేకపోవటానికి కారణాలేవైనా కానీండి రిజల్ట్ మాత్రం మొండిచెయ్యే. పైగా వైఎస్సార్ఎల్పి సమావేశం తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ తనకు మంత్రిపదవి వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అలాంటిది సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

మంత్రివర్గంలో చోటు లేకోవటంతో అలిగిందని తెలుసుకున్న జగన్ వెంటనే రోజాకు ఫోన్ చేసి అందుబాటులో ఉండాలని చెప్పారట. మంత్రివర్గంలో చోటు కల్పించలేనపుడు అందుబాటులో ఉండమని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అలా చెప్పారంటే జగన్ లో ఏమైనా రెండో ఆలోచన ఉందేమో అని అనుకుంటున్నారు.