శృతిమించిన ర్యాగింగ్… మంత్రి జోగి ర‌మేశ్ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్యలు!

పవన్ కల్యాణ్ పుణ్యమాని ఏపీలో గతకొన్ని రోజులుగా రాజకీయ విమర్శలు కోటలు దాటుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి పవన్ ఏకవచనంతో పిలుస్తుండటం.. జగ్గూ బాయ్ అంటూ పిలవడంతో వైసీపీ నేతలు మండిపోతున్నారు. జగన్ పర్మిషన్ కోసం చూసినట్లుగా చూశారు.

ఈ సమయంలో వెంకటగిరిలో జగన్ ఫైరయ్యారు. పవన్, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ల క్యారెక్టర్ లపై కౌంటర్ ఇవ్వలేని స్థాయిలో ఫైరయ్యారు. తన వ్యాఖ్యలకు సంబంధించి ప్రూఫులు కావాలంటే యూట్యూబ్ లో దొరుకుతాయని హింట్ ఇచ్చారు. ఫలితంగా… ఆ నలుగురూ ఇప్పట్లో తేరుకోరనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో జగన్ సీరియస్ వ్యాఖ్యలతో గ్రీన్ సిగ్నల్ వచ్చిందనుకున్నారో ఏమో కానీ… మంత్రి జోగి రమేష్ నిప్పులు చెరిగారు.

అవును… కృష్ణాయ‌పాలెంలో ఇళ్ల నిర్మాణ ప‌నుల‌కు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ శంకుస్థాప‌న చేసిన అనంత‌రం వెంక‌ట‌పాలెంలో నిర్వహించిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రి మాట్లాడుతూ ప‌వ‌న్‌ పై చెల‌రేగిపోయారు. పవన్ తో పాటు చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా తమ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుని కూడా పరోక్షంగా సంభోదించారు జోగి రమేష్!

ఎక్కడైనా ప్రతిపక్షాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వమని పోరాటం చేస్తాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌ లోనే విచిత్రంగా పేదల ఇళ్లకు అడ్డుపడ్డాయని, ఇంత దుర్మార్గులను ఎక్కడా చూడలేదని ఆంధ్రప్రదేశ్‌ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సీఆర్డీఏ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

“రాజకీయాల్లో చంద్రబాబు అంత దౌర్భాగ్యుడు లేడు.. ఈ నాలుగేళ్లు సైలెంట్‌ గా ఉండి, ఎన్నికల సీజన్‌ స్టార్ట్‌ కాగానే రోడ్డెక్కాడు.. ఇదెలా ఉందంటే… చిత్తకార్తెలో కుక్కల్లాగా రోడ్డెక్కినట్లుంది. ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు పేదలకు ఏనాడూ మంచి చేసింది లేదు.. శవాలను సైతం పీక్కుని తినేరకం బాబు.. అలాంటోడు మళ్లీ వస్తున్నాడు.. అప్రమత్తంగా ఉండాలి అని తీవ్రస్థాయిలో అభ్యంతరక పదాలు వాడుతూ బాబుపై విమర్శలు గుప్పించారు జోగి రమేష్!

అనంతరం… “ఇంకోడున్నాడు పవన్‌ కల్యాణ్‌.. పిచ్చి కుక్కలాగా అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నాడు.. భార్యలతో పాటు ఎన్ని పార్టీలు మారుస్తావ్‌ రా నాయనా? మార్చడం.. తార్చడం పవన్‌ కు వెన్నతో పెట్టిన విద్య.. ఢిల్లీలో విగ్గురాజు ఒకడున్నాడు.. వాడితో కలిసి ఇలా పార్టీలు మార్చడం, ఎన్నికల్లో పోటీ చేయించడం లాంటి కంపెనీ ఒకటి పెట్టుకో” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో “ఇంకొకడున్నాడు… చంద్రబాబు గాలికి వదిలేస్తే నడుచుకుంటూ ఊళ్లన్నీ తిరుగుతున్నాడు. ఆ ఊర పందికి సింహంలాంటి సీఎం జగన్‌ తో పోటీయా?..” అంటూ పరోక్షంగా నారా లోకేష్‌ పై జోగి రమేష్‌ విరుచుకుపడ్డారని తెలుస్తుంది!

అనంతరం… “సీఎం జగన్‌ పేదలకు చేయూత ఇస్తున్నాడు.. అన్నం పెడుతున్నాడు.. అమ్మ ఒడి ఇస్తున్నాడు.. కోటి మంది అక్కచెల్లెమ్మలకు ఆసరా ఇస్తున్నాడు.. అద్దె ఇళ్లలో ఉంటున్నవాళ్లకు శాశ్వత గూడులు కల్పిస్తున్నాడు.. ఎంత మంది వచ్చినా సీఎం జగన్‌ ను టచ్‌ కూడా చేయలేరు..” అంటూ జోగి రమేశ్‌ ఆవేశపూరితంగా ప్రసంగించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్, లోకేష్ లపై జోగి రమేష్ చేసిన అభ్యంతరకర విమర్శలకు రియాక్ష్న్ ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.