సహజ నటి జయసుధ టిడిపిని వీడి వైసిపిలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. జయసుధ గత కొంతకాలంగా టిడిపి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2009లో ఆమె కాంగ్రెస్ నుంచి గెలిచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ తర్వాత 2016 జనవరి 16న టిడిపి లో చేరారు. పార్టీలో తగిన గుర్తింపు రాకపోవడంతో ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారు.
తాజాగా గురువారం సాయంత్రం 4 గంటలకు ఆమె జగన్ సమక్షంలో వైసిపిలో చేరుతారని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. నేతల వలసలతో రాజకీయం హాట్ టాపిక్ గా మారింది.
