పరిపాలనలో ఒక్కో ముఖ్యమంత్రీ తనదైన ఒక ముద్ర రాష్ట్రంపై ఉండాలని.. ఆ కార్యక్రమం ద్వారా చరిత్ర పుటల్లో తన పేరు శాస్వతంగా లిఖించబడాలని కోరుకుంటుంటారు. ఎన్టీఆర్ కిలో రెండురూపాయల్ బియ్యం అని ప్రకటించినా.. మండలి వ్యవస్థను తెరపైకి తెచ్చినా.. చంద్రబాబు హైటెక్ సిటీ అన్నా… వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ లను ప్రవేశపెట్టినా… అది అందులో భాగమే! ఈ విషయంలో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని తెచ్చుకోవడంలో సచివాలయ వ్యస్థ జగన్ కి సహకరించిందనే చెప్పాలి. ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఫలితంగా ప్రతిపక్షాలకు తనదైన షాకిచ్చారు!
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే… గ్రామ, వార్డు సచివాలయాలకు చట్టబద్ధత కల్పించటం. అవును… వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి చాలా మంచి పేరే వచ్చిందని చెప్పుకోవాలి. సచివాలయాల్లో అందుతున్న సేవల ద్వారా జనాలు సంతోషంగా ఉన్నారనేది వాస్తవం! దీంతో.. ఈ వ్యవస్థలకు చట్టబద్దత కల్పించాలని జగన్ ఫిక్సయ్యారు.
అయితే… ఈ వ్యవస్థ మొదట్లో తరచూ వివాదాస్పదమయ్యేది. ఈ వ్యవస్థలపై దాఖలైన కేసుల విషయంలో స్పందించిన కోర్టులు కూడా.. సచివాలయాల చట్టబద్ధతపై ప్రశ్నల వర్షాలు కురిపించాయి. అయితే అనతికాలంలోనే ఏ చంద్రబాబైతే ఈ వ్యవస్థనలు వ్యతిరేకించారో… అనంతర కాలంలో… ఇలాంటి ఆలోచన తాను గతంలోనే చేశానని, వీటిని తాను అధికారంలోకి వచ్చినా కూడా కొనసాగిస్తానని చెప్పుకోవాల్సి వచ్చింది.
దీంతో… ఈ వ్యవస్థలపై తనమార్కు ముద్ర ఫిక్స్ చేయాలని ఫిక్సయిన జగన్… గ్రామ, వార్డు సచివాలయాలకు చట్టబద్ధత కల్పించాలని క్యాబినెట్ లో డిసైడ్ చేసేశారు! అయితే వీటిలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు డైరెక్టుగా ప్రభుత్వ ఉద్యోగులు కాదు. వీళ్ళందరినీ ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుంది. ఇందులో భాగంగా… సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లుగా సుమారు 4 లక్షల మంది వీటిలో పనిచేస్తున్నారు. ఇంతటి భారీ వ్యవస్థకు చట్టబద్ధత కల్పించాలని జగన్ భారీ నిర్ణయం తీసుకున్నారు!
ప్రజాదరణను పొందిన సచివాలయ వ్యవస్థకు చట్టబద్ధత కల్పించటం ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవలను ఈ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావచ్చని జగన్ భావిస్తున్నారు. దీంతో… త్వరలో ఎన్నికలు ఉండటంతో.. జగన్ తీసుకున్న ఈ దెబ్బ ప్రతిపక్షాలకు భారీ స్ట్రోక్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
