ఎవరూ ఊహించని ప్లాన్ వేసిన జగన్.. గెలుపును ఆపడం ఎవరి తరం కాదుగా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏ ప్లాన్ వేసినా ఆ ప్లాన్ వెనుక ప్లానింగ్ మామూలుగా ఉండదని అందరూ భావిస్తారు. వైసీపీ 2024 ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే విధంగా జగన్ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటూ ఉండటం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. జగన్ గెలుపును ఆపడం ఎవరి తరం కాదని కొంతమంది నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రతి 50 ఇళ్లకు ఒక మహిళను, ఒక పురుషుడిని పార్టీ వాలంటీర్లుగా జగన్ నియమించనున్నారు.

 

ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న గ్రామ, వార్డ్ వాలంటీర్లకు వీళ్లు అదనం అని చెప్పవచ్చు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. దాదాపుగా 10 లక్షల కుటుంబాలు పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా జగన్ ప్రణాళికను సిద్ధం చేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఈ గృహ సారథులు అర్హతలు ఉండి పథకాలు అందని వాళ్లకు బెనిఫిట్ కలిగేలా చేయనున్నారు.

 

అదే సమయంలో ఎమ్మెల్యేలకు కూడా జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కచ్చితంగా గెలుస్తారనే నమ్మకం ఉన్నవాళ్లకు మాత్రమే టికెట్లు ఇస్తామని జగన్ చెబుతున్నారు. 2019 మ్యాజిక్ ను కచ్చితంగా రిపీట్ చేయాలని జగన్ భావిస్తున్నారు. వై నాట్ 175 అనే లక్ష్యంతో జగన్ ముందుకెళుతున్నారు. జగన్ ప్లాన్ మామూలుగా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు మరింత దగ్గర కావడానికి ఉన్న ఏ అవకాశాన్ని జగన్ వదులుకోవడం లేదు.

 

2024 ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా విజయం సాధించడం కోసం జగన్ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. జగన్ వచ్చే ఎన్నికల్లో మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొనిరావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ కొత్తకొత్త ప్రణాళికలతో ప్రజలకు దగ్గరవుతూ ఉండటంతో ఇతర పార్టీల నేతలు తెగ టెన్షన్ పడుతున్నారు.