అయ్యో…ఓటమి ఎంత పని చేసింది ?

బండ్లు ఓడలు..ఓడలు బండ్లు అవుతాయన్న నానుడి చంద్రబాబునాయుడు విషయంలో సరిగ్గా సరిపోతుంది. హంగు, ఆర్భాటం, ఆడంబరాలు, మందీ, మార్బలం లేకుండా చంద్రబాబు కదలటానికి ఇష్టపడరన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి చంద్రబాబుకు మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పరిస్దితులన్నీ తల్లక్రిందులైపోయాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే అరోగ్య పరీక్షలంటూ చంద్రబాబు తన భార్య భువనేశ్వరితో పాటు అమెరికాకు వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా సరే చంద్రబాబు అమెరికాకు వెళ్ళటానికే ప్రాధాన్యత ఇచ్చారు. సరే చంద్రబాబుకున్న అనారోగ్యం ఏమిటి ? జరిపించుకున్న పరీక్షలేమిటి ? అన్న విషయాలు బయటకు తెలిసే అవకాశాలు లేవులేండి.

అమెరికాలోని ఓ హోటల్లో చంద్రబాబు దంపతులు కూర్చుని కాఫీ తాగుతున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫొటోలో కనబడుతున్న ప్రకారమైతే దంపతులు ఇద్దరే ఓ టేబుల్ కు అటు ఇటు కూర్చుని ఉన్నారు. చుట్టు పక్కల చంద్రబాబు అభిమానులున్నది లేనిది కూడా తెలీలేదు.

తనతో పాటు సెక్యురిటి సిబ్బందిని ఎవరినైనా తీసుకువెళ్ళారా లేదా అన్న విషయాలు కూడా బయటకు తెలీదు. ఎందుకంటే ఫొటోలో అయితే దంపతులిద్దరు మాత్రమే కనబడుతున్నారు. అదికూడా  మొబైల్ ఫోన్లో లాంగ్ షాట్ నుండి తీసినట్లున్నారు.  ఫొటోని చూడగానే చంద్రబాబు అని ఈజీగా గుర్తు పట్టేయొచ్చులేండి. మొత్తానికి చుట్టుపక్కల ఎవరూ లేకుండా దంపతులిద్దరే కూర్చుని కాఫీ తాగుతున్న ఫొటో మాత్రం బాగా వైరల్ అయ్యింది.