హైదరాబాద్ లో మరో ప్రణయ్ అమృత ఘటన

మిర్యాలగూడలో మారుతీరావు తన బిడ్డ అయిన అమృత భర్త  ప్రణయ్ ని హత్య చేయించిన ఘటన మరవకముందే హైదరాబ ాద్ లో మరో ఘటన చోటు చేసుకుంది. సొంత అల్లుడిని సుపారీ ఇచ్చి హత్య చేయించాడు మారుతీరావు. మారుతీరావు సహా నిందితులందరినీ అరెస్టు చేసిన కొద్ది గంటల్లోనే మరో దారుణం హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

తన కూతురు వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కసితో ఆమెతోపాటు ఆమె భర్త పై దాడి చేశాడు ఆ తండ్రి. కత్తి తో దాడి చేయడంతో ఆ అమ్మాయి రక్తపు మడుగులో పడి కొట్టుమిట్టాడింది. మాధవి తల, చేతులపై బలంగా దెబ్బలు తాకడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది.

ఈ దాడిలో గాయపడిన అమ్మాయి పేరు మాధవి అని, అబ్బాయి పేరు సందీప్ అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 

ఎస్ ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ వద్ద వీరిద్దరూ నిలబడి ఉన్న సమయంలో  నడి రోడ్డుపై జరిగిన ఘోరం ఇది. ప్రేమజంట పై అమ్మాయి తండ్రే ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. 

అమ్మాయి ఒంటిపై బలమైన గాయాలు కావడంతో రక్తం ఏరులై పారింది.  ప్రేమ వివాహం చేసుకున్న సందీప్ మాధవిలను మాట్లాడుకుందామని పిలిచి నడిరోడ్డు పై మాధవి తండ్రి అతి కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. పెళ్లిని అంగీకరిస్తామని, కొత్త బట్టలు కొనస్తామని నమ్మబలికారు. దీంతో వారు రావడంతో దాడి చేసి హత్య చేయబోయాడా తండ్రి.

ప్రేమ వివాహం చేసుకున్న మాధవి, నవదీప్

స్థానికులు స్పందించి సనత్ నగర్ లోని ఒక ప్రయివేటు హాస్పిటల్ కి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఎస్.ఆర్. నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అమ్మాయి తండ్రి పరారీలో ఉన్నాడు. ప్రేమ పెళ్లి నచ్చకపోవడంతోనే నడి రోడ్డుపై దాడికి తెగబడ్డట్లు తెలుస్తోంది.  బోరబండకు చెందిన మాధవి బిసి కులానికి చెందిన యువతి కాగా, బోరబండ ప్రేమ్ నగర్ కు చెందిన సందీప్ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. వీరిద్దరు ప్రేమించి నెల రోజుల కింద పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం నచ్చని మాధవి తండ్రి ఈ దారుణానికి తెగబడ్డాడు.

డ్రికి ఈ వివాహం ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో ఇద్దరి మీద పగ పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా ఇద్దరినీ మట్టు పెట్టాలన్న ఉద్దేశంతోనే దాడి చేసినట్లు చెబుతున్నారు. మాట్లాడుకుందాం రమ్మని ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ దగ్గర నడి రోడ్డుపై దారుణానికి తెగబడ్డాడు.

అమ్మాయి పై కిరాతకంగా దాడి చేశాడు తండ్రి. ఆమె మెడ మీద, తలపైన గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలోరక్తపు మడుగులో అమ్మాయి కొట్టుమిట్టాడుతూ ఉండడాన్ని చూసిన స్థానికులు తల్లడిల్లిపోయారు.

మాధవిని మేనబావకిచ్చి పెళ్లి చేయాలనుకోగా వేరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఆగ్రహంతో అమ్మాయి తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు. మాధవి సందీప్ లు 5 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. నెల రోజుల క్రితమే వారు రిజిష్టార్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు. 

దాడి జరిగిన తీరు సిసి కెమెరాల్లో రికార్డయింది. బైక్ మీద వచ్చి ఇద్దరి మీద కత్తితో దాడి చేశాడు  ఆ వ్యక్తి. దాడి సమయంలో స్థానికంగా ఉన్న వ్యక్తి కాపాడే ప్రయత్నం చేయడంతో అతడిని కత్తితో బెదిరించాడు. ఈ వివరాలన్నీ సిసి కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. అమ్మాయిని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. 

సిసి పుటేజీలో రికార్డైన వీడియో కింద ఉంది చూడండి. తండ్రి ఎంత కసిగా వారి మీద కత్తితో దాడి చేశారో…