అవును ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం. జూన్ నెల అయిపోయినా రైతులకు ప్రభుత్వం విత్తనాలను అందిచలేకపోయినందన్నది వాస్తవం. తమకు విత్తనాలు అందకపోవటంతో రైతులు రోడ్డెక్కారు. నిజానికి రైతులకు విత్తనాలను సకాలంలో అందకపోవటంలో తప్పెవరిది ?
ఎవరిదంటే ముమ్మాటికి చంద్రబాబునయుడుదే అనటంలో సందేహం లేదు. ఎందుకంటే విత్తనాలను ముందుగానే సేకరించి జూన్ నెలలోనే రైతులకు పంపిణీ చేయాలి ప్రభుత్వం. జూన్ నెలలోనే విత్తనాలను రైతులకు అందించాలంటే కనీసం మార్చి, ఏప్రిల్ నెలలోనే సేకరణ మొదలుపెట్టాలి. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నదెవరు ? ఇంకెవరు చంద్రబాబే కద ? అప్పుడెందుకు చంద్రబాబు ఆ పనిచేయలేదు ?
ఎందుకంటే ఖజానాలో ఉన్న కోట్లాది రూపాయలను ఎన్నికల్లో తాయితాల పంపిణీకే సరిపోలేదు చంద్రబాబు. ఏపి సీడ్స్ దగ్గరున్న రూ 380 కోట్లను కూడా చంద్రబాబు ఇదే విధంగా నాకేసినట్లు మంత్రి కన్నబాబు చెబుతున్నారు. అంటే విత్తనాల సేకరణకు చేయాల్సిన ఖర్చును కూడా చంద్రబాబు ఎన్నికల్లో ఓట్లకోసం తాయిలాలుగా వాడేసినట్లు అర్ధమవుతోంది.
వాస్తవాలు ఈ విధంగా ఉంటే లోకేష్ మాత్రం విత్తనాల కొరతంతా జగన్మోహన్ రెడ్డి చేతకానితనమే అన్నట్లుగా ట్వీట్లు పెడుతున్నారు. అంటే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినా టిడిపికి బుద్ది రాలేదన్నమాట. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రైతులను ప్రభుత్వంపైకి లోకేష్ రెచ్చ గొడుతున్నట్లు అర్ధమైపోతోంది.
