పవన్ గెలుపు కోసం ఇతను ఏం చేశాడో చూడండి (వీడియో)

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నాయకుల్లోనే కాదు కార్యకర్తల్లో, అభిమానుల్లో ఎన్నికల టెన్షన్ మొదలైంది. తమ నాయకుడే సీఎం పీఠాన్ని అధిష్టాంచాలనే బలమైన కోరిక వారిలో రోజు రోజుకి బలపడుతోంది. దీనికోసం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో విజయవాడలో ఒక జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ సీఎం కావాలని చేసిన చర్య అందరి దృష్టిని ఆకర్షించింది. షేక్ ఫయాజ్ అనే జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ సీఎం కావాలని దుర్గ గుడికి మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్ళాడు. పవన్ ఫోటో పట్టుకుని ఇంద్ర కీలాద్రి చేరుకున్నాడు. అంత దూరం మోకాళ్లపై నడవటం కష్టం అయినా అతని స్నేహితుల సహాయంతో ఆ పని పూర్తి చేశాడు.

పవన్ అభిమానులంతా అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పవన్ కోసం ఏం చేయడానికైనా మేము రెడీ అని పవన్ అభిమానులు తరచూ చెబుతూ ఉంటారు. మాకు పవన్ అంటే ఎంతో అభిమానం, దానికి లెక్కే లేదు అనేది వారి వెర్షన్. షేక్ ఫయాజ్ కూడా తన హీరోపై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా కనబరిచాడు. ముస్లిం అయుండి దుర్గ గుడికి మోకాళ్లపై నడవటం విశేషం. ఈ సంఘటన స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. అతడు చేసిన ఈ పని పవన్ మీద ఉన్న అభిమానం మాత్రమే కాదు కులమత సామరస్యాన్ని కూడా చాటుతోందని పలువురు ప్రశంసించారు.

సామాన్యులకు న్యాయం జరగాలన్నా, అన్ని కుల వర్గాలకు న్యాయం జరగాలన్నా పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే సాధ్యం అవుతుందని షేక్ ఫయాజ్ పేర్కొన్నాడు. యువతరం తలరాతలు మారాలంటే పవన్ సీఎం కావాలని ఆశాభావం వ్యకతం చేశాడు. అధికార పార్టీ నేతలు జనసేన పార్టీ బలపడకుండా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని షేక్ ఫయాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన పోవాలని, ప్రజలు మెచ్చే పాలన రావాలని కనకదుర్గమ్మను వేడుకుంటూ తాను మోకాళ్లపై నడుచుకుంటూ ఇంద్రకీలాద్రి చేరుకున్నట్టు తెలిపాడు. వీడియో కింద ఉంది చూడండి