ఈ పబ్ కు వచ్చిన లేడీ, సర్వీస్ బాయ్ ఏం చేసిండో తెలుసా?

హైదరాబాద్ లో పబ్ కల్చర్ రోజు రోజుకూ పెరిగిపోతున్నది. చిన్న చిన్న సందుల్లో కూడా పబ్ ల ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నది సర్కారు. దీంతో లెక్క లేనంతగా పబ్ ల సంఖ్య పెరిగిపోతున్నది. పబ్ ల నిర్వహణలో రాజకీయ పెద్దలు కూడా ఇన్వాల్వ్ కావడంతో పబ్ లలో ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు తయారైంది.

మాదక ద్రవ్యాలు, తాగుడు, తందనాలాడుడు పబ్ లలో నిత్యం జరుగుతున్నది. మితిమీరిన మత్తు కోసం యూత్ పబ్ కు వచ్చి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. ఉన్నత వర్గాల వారి పిల్లలే పబ్ లలో ఎంజాయ్ పేరుతో పీకల దాకా తాగి తెల్లవార్లు గంతులేయడం నేడు ఫ్యాషన్ గా మారింది. అసాంఘిక కార్యకలాపాలకు పబ్ లు కేరాఫ్ అడ్రస్ గా మారాయి.

ఇక అసలు విషయానికి వస్తే హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని రోడ్డు నెంబరు 36లో 788 అవెన్యూ పబ్ ఉంది. ఈ పబ్ కు అమృత అనే మహిళ వచ్చారు. ఆమె పబ్ లో కొద్దిసేపు గడిపారు. తర్వాత టేబుల్ మీద డైమండ్ బ్రేస్ లెట్ మరచిపోయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడ ఆమె మరచిపోయిన బ్రేస్ లెట్ ను పబ్ లో పనిచేసే సర్వీస్ బాయ్ సైలెంట్ గా కొట్టేశాడు. తన వద్దే దాచిపెట్టుకున్నాడు. 

తన బ్రేస్ లెట్ ను పబ్ లోనే పోగొట్టుకున్నానని దాని విలువ మూడు లక్షలు ఉంటుందని ఆ మహిళ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. పబ్ లో ఉన్న సిసి కెమెరాలు పరిశీలించారు. అయితే సిసి కెమెరాల్లో సర్వీస్క బాయ్ శ్రీనివాస్ ఆ డైమండ్ బ్రేస్ లెట్ కొట్టేసినట్లు క్లియర్ గా రికార్డు అయింది.

దీంతో శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అప్పుడు శ్రీనివాస్ నేరాన్ని అంగీకరించాడు. ఆ డైమండ్ బ్రేస్ లెట్ ను పోలీసులకు అప్పగించాడు శ్రీనివాస్. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.