జయరాం హత్య కేసులో ఏసీపీ మల్లారెడ్డి పై వేటు

ఎక్స్ ప్రెస్ టివి చైర్మన్ జయరామ్ హత్య కేసులో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి పై బదిలీ వేటు పడింది. జయరామ్ ను హత్య చేసిన తర్వాత నిందితుడు రాకేష్ రెడ్డి మల్లారెడ్డితో మాట్లాడారు. మల్లారెడ్డినే హత్యను ప్రమాదంగా చిత్రికరించమన్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో మల్లారెడ్డిని అంబర్ పేట హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ రాచకొండ సీపీ ఎంఎం భగవత్ ఆదేశాలిచ్చారు. ఏపీ పోలీసుల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.  మల్లారెడ్డి ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఏసీపీగా పని చేస్తున్నారు.