ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సతీసమేతంగా, సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు నేరుగా అమ్మవారి గర్భగుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు: కూటమి ప్రభుత్వం శుభవార్త
దొంగచాటు సంతకాలకు ‘AI’ చెక్: వైసీపీ ఎమ్మెల్యేలపై మాధవి రెడ్డి ఫైర్
ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలతో పాటు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, గాజులను కూడా ఆయన కనకదుర్గ అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులకు శాస్త్రోక్తంగా వేదాశీర్వచనం పలికారు. దర్శనానంతరం వారికి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు.
ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తులు, అధికారులు, సిబ్బందితో కోలాహలం నెలకొంది.

