Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్.. గేర్ మార్చిన చంద్రబాబు టీమ్!

ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత ప్రాముఖ్యమైన ప్రాజెక్ట్‌లలో పోలవరం ఒకటి. రాష్ట్ర భవిష్యత్తుకు మేలుకలిగించే ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని చంద్రబాబు ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. గతంలో వివిధ అడ్డంకుల కారణంగా పనులు మందకొడిగా సాగినప్పటికీ, ఇప్పుడు ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం పనులను ప్రాధాన్యతగా తీసుకుని, నిర్విరామంగా పనులు జరగేలా చర్యలు చేపట్టారు.

ప్రత్యేకంగా డయాఫ్రం వాల్ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. జనవరిలో డయాఫ్రం వాల్ పనులు ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించగా, ప్రస్తుతం ఆ పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కొన్ని పనులు నిలిచిపోయినప్పటికీ, వాటిని తిరిగి ప్రారంభించి, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. రాత్రి పగలు తేడా లేకుండా పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి.

పోలవరం పూర్తయితే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. అందుకే ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో డయాఫ్రం వాల్ అనంతరం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణ పనులు కూడా త్వరితగతిన ప్రారంభించాలని ప్రభుత్వం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసింది. అన్ని అనుమతులను సమకూర్చిన తర్వాత వెంటనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి.

మొత్తంగా పోలవరం పనుల పునఃప్రారంభం రాష్ట్ర ప్రజలకు మంచి సంకేతాన్ని అందిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జాప్యం జరిగినా, చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడు ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయి. పోలవరం పూర్తి అయితే రాష్ట్ర వ్యవసాయం, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

జగన్ విజయసాయిరెడ్డి డ్రామా|| Director Geetha Krishna On Vijay Sai Reddy Resignation || YsJagan || TR