చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం (వీడియో)

చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం జరిగింది. పుంగనూరులో చైతన్య భారతి ఇంగ్లీషు మీడియం స్కూల్ ఉంది. స్కూల్ కు గురువారం ఉదయం ఐదుగురు విద్యార్దులు ఆలస్యంగా వచ్చారు. దీంతో క్లాస్ టిచర్ ఆ ఐదుగురు విద్యార్దులను బట్టలిప్పించి నగ్నంగా క్లాస్ రూము ముందు నిలబెట్టింది. దీనిని మిగతా టిచర్లు చూసిన పట్టించుకోలేదు. ఓ వైపు ఇతర తరగతుల వారికి క్లాసులు అవుతుండగానే మరో పక్క వీరిని నగ్నంగా ఎండలో నిలబెట్టారు.

 ఈ ఘటన పై విద్యార్ది సంఘాలు, బాలల హక్కల సంఘం మండిపడుతున్నాయి. చిన్నారుల హక్కులను కాలరాశారని వారు   ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్  కు ఆలస్యంగా వచ్చారని నగ్నంగా నిలబెడుతారా అని వారు ప్రశ్నించారు. విద్యార్దుల పై అమానుషంగా వ్యవహరించిన స్కూల్  యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించాలని విద్యార్ది సంఘాలు విజ్ఞప్తి చేశాయి.

ప్రస్తుతం విద్యార్దులను నగ్నంగా ఎండలో నిలబెట్టిన వీడియో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ విషయం ఉన్నతాధికారులు, మంత్రుల దృష్టికి వెల్ళినట్టు తెలుస్తోంది. ఈ ఘటన పై వారు కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. పాఠశాల పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. విద్యార్దులను నగ్నంగా నిలబెట్టిన వీడియో కింద  ఉంది చూడండి.