Crime News: పాఠశాలలో అల్లరి చేయొద్దని చెప్పినందుకు విద్యార్థిని చంపిన సహా విద్యార్థిని.. ఎక్కడంటే?

Crime News:సాధారణంగా పాఠశాలలో పిల్లలు అన్న తర్వాత అల్లరి చేయడం సర్వసాధారణమే అయితే కేవలం క్లాస్ రూమ్ లో అల్లరి చేస్తున్న విద్యార్థులను అల్లరి చేయకండి అని చెప్పిన పాపానికి ఆ విద్యార్థి ప్రాణాలను బలి తీసుకున్నాడు మరో విద్యార్థి ఈ ఘటన
హైదరాబాద్ లో సాయి కృప హై స్కూల్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…. శ్రీ కృష్ణానగర్‌లోని బీ బ్లాక్‌కు చెందిన సయ్యద్‌ మంజూర్‌ (15) స్థానికంగా ఉన్న సాయికృప హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాలకు వెళ్లిన ఇతడు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో డిజిటల్‌ క్లాస్‌ వింటున్నాడు. అయితే ఈ సమయంలో క్లాస్ రూం లో టీచర్లు ఎవరూ లేకపోవడంతో మరొక విద్యార్థి కాగితాలతో రాకెట్ తయారు చేసి క్లాస్ రూమ్ లో వేశాడు.

దీంతో బాగా డిస్టర్బ్ అయిన సయ్యద్ కాగితాలు వేయడం ఆపాలని సహ విద్యార్థులతో గొడవ పెట్టుకున్నాడు.నన్ను అలా అంటావా? అంటూ మంజూర్‌ కాలర్‌ పట్టుకుని విద్యార్థి కొట్టాడు. ఇక ఇతర విద్యార్థుల కూడా మంజూర్ పై దాడి చేశారు. ఇలా ఒక్కసారిగా అందరూ దాడి చేయడంతో మంజూర్‌ తరగతి గదిలోనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు హుటాహుటిన కృష్ణా నగర్ లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో మంజూర్‌ ను పరీక్షించిన వైద్యులు అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెంటనే తనని వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లాలని సూచించడంతో అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతని గుండె చప్పుడు మందగించడంతో హాస్పిటల్లో చేర్పించిన కొంత సమయానికి మంజూర్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అతని తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.