Crime News: జైపూర్ లో దారుణం.. పదో తరగతి బాలిక మీద అత్యాచారానికి పాల్పడిన స్కూల్ యజమాని..

Crime News: ఈ రోజుల్లో మహిళలు మగవారికి సమానంగా చదువులో రాణిస్తూ అన్నిరంగాల్లోనూ మగవారికి దీటుగా గట్టి పోటీ ఇస్తున్నారు. అటువంటిది ప్రస్తుతం ఈ సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. స్కూల్ , కాలేజీ, ఆఫీస్ ఇలాఎక్కడ ఉన్నా కొందరి నీచులు వారి కామవాంఛలు తీర్చుకోవడానికి మహిళల మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఆఖరికి చిన్నపిల్లలు ముసలి వారు అని కూడా కనికరం లేకుండా వారి మీద అత్యాచారాలు చేస్తున్నారు. ఇటీవల రాజస్థాన్ లోని జైపూర్ లో అటువంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే…పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలు ఇటీవల కాలంలో చాలా వెలుగులోకి వచ్చాయి.తాజాగా రాజస్థాన్ ​లోని జైపూర్​ లో 10వ తరగతి చదువుతున్న ఓ చిన్నారిపై స్కూల్​ యజమాని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలికను బెదిరించి తన కోరికను తీర్చకపోతే నీ అంతు చూస్తాను అంటూ బాలికను బెదిరించి లొంగదీసుకొని అత్యాచారం చేశాడు. ఇటీవల బాలిక అస్వస్థతకు గురికావడంతో వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లగా బాలిక రెండు నెలల గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం గురించి తల్లిదండ్రులు బాలికను నిలదీయగా జరిగిన విషయం మొత్తం తల్లిదండ్రులతో చెప్పింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు స్కూల్ యజమాని అయిన పురుషోత్తమ్ శర్మపై మంగళవారం ముహానా పోలీస్ స్టేషన్ లో పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ తరుణంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.