కానిస్టేబుల్ ఉద్యోగమిప్పిస్తానని ఈ పంతులు అమ్మాయిని ఏం చేసిండంటే

పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పి అందరికి ఆదర్శంగా నిలవాల్సిన వాడు వక్ర బుద్ది పట్టాడు. మాయమాటలు చెప్పి ఉద్యోగమిస్తానని నమ్మించి యువతిని మోసం చేశాడు. ఆ ప్రబుద్దిడికి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని దాచి యువతిని మోసం చేశాడు. చివరకు ఆ యువతి ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…

చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం గుండ్రాజుఇళ్ళకు చెందిన కె.గురుమూర్తి రామకుప్పం మండలం గురుకులమడుగు ప్రాథమిక పాఠశాలలో 8 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కళావతి, చెల్లప్పనాయుడు కుమార్తె శ్రావణి(21) అతనితో చనువుగా ఉండేది. శ్రావణికి పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

మూడు రోజుల క్రితం గురుమూర్తి తాను అద్దెకు ఉంటున్న కార్వేటినగరంలోని ఇంటికి తీసుకువచ్చాడు. అప్పటికే గురుమూర్తికి ఏడేళ్ళ క్రితం వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గురుమూర్తికి  పెళ్లైనట్టు శ్రావణికి తెలియదు. ఈ విషయమై ఇద్దరికి గొడవ జరిగింది. దీంతో అవమానంగా భావించిన శ్రావణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.