అమరావతిని జగన్ మారుస్తారని బాబుకు ముందే తెలుసా.. ఇదే సాక్ష్యమంటూ?

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో రోజుకో కొత్త మలుపు చోటు చేసుకుంటోంది. అమరావతిని రాజధానిగా కొనసాగించడం జగన్ సర్కార్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. విశాఖ నుంచి పాలన సాగించాలని జగన్ అనుకుంటున్నా కోర్టు నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో జగన్ ఆ విషయంలో వెనక్కు తగ్గడం గమనార్హం. అయితే అమరావతిని రాజధానిగా జగన్ కొనసాగించరని చంద్రబాబుకు ముందే తెలుసని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇందుకు సంబంధించిన పేపర్ క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందే చంద్రబాబు ఒక సందర్భంలో జగన్ వస్తే రాజధాని బంద్ అని అమరావతి ఆగిపోతుందని పోలవరం ప్రాజెక్ట్ కూడా ఆగిపోతుందని అమరావతి, పోలవరం ఆగిపోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అయితే జగన్ రాజధానిని మార్చడానికి టీడీపీనే కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం జగన్ కు ఏ మాత్రం ఇష్టం లేదని అమరావతిని అభివృద్ధి చేయాలంటే భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేయాల్సి ఉంటుందని జగన్ భావిస్తున్నారు. విశాఖను రాజధానిగా చేయడం వల్ల రాజధాని అభివృద్ధి జరుగుతుందని జగన్ భావిస్తున్నారు. చంద్రబాబు అంత మంచి వ్యక్తి అయితే జగన్ ఎందుకు సీఎం అయ్యారని కొంతమంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ ప్రజలు అంతా సంతోషంగానే ఉన్నారని కేవలం టీడీపీ నేతలు మాత్రమే సంతోషంగా లేరని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అమరావతి రాజధానిగా ఉండటం మెజారిటీ ప్రజలకు ఇష్టం లేదని అందుకే ఆయనను గెలిపించారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. జగన్ నిర్ణయం వల్ల అమరావతితో పాటు ఇతర ప్రాంతాల అభివృద్ధి కూడా జరుగుతోందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.