ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని చంద్రబాబు అడుక్కున్నారా.. సింపతీ ఓట్లు పడతాయా?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్ స్టాపబుల్ ప్రోమోలో చెప్పిన విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నా ఆయన నా మాట వినలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 1995లో తాను ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చిందో కూడా చంద్రబాబు వివరణ ఇచ్చారు. ప్రోమో చూస్తుంటే చంద్రబాబు తన తప్పు లేదనే అభిప్రాయం కలిగే విధంగా ప్రోమోలో చెప్పుకొచ్చారు.

అదే సమయంలో వైఎస్సార్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చంద్రబాబు వెల్లడించడం గమనార్హం. అయితే ఈ ప్రోమో ద్వారా చాలామందిలో కొన్ని సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని చంద్రబాబు అడుక్కున్నారనే కామెంట్లపై లక్ష్మీపార్వతి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. అయితే ఈ మాటలు ఏ మాత్రం నమ్మశక్యంగా లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తనపై వ్యతిరేకత ఉన్నవాళ్లలో సైతం పాజిటివ్ ఒపీనియన్ కలిగే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.

జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ ను మాత్రం కావాలనే స్కిప్ చేసినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానున్న నేపథ్యంలో ఆ ఎపిసోడ్ లో చంద్రబాబు ఎన్ని కొత్త విషయాలను వెల్లడిస్తారో చూడాల్సి ఉంది. అన్ స్టాపబుల్ సీజన్2 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో వివాదాలను టచ్ చేసినా మరీ హద్దులు దాటినట్టు అనిపించడం లేదు. జగన్ గురించి కూడా చంద్రబాబు ఈ షోలో ప్రస్తావించినట్లు లేరు.

అయితే హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబే కారణమనేలా బాలయ్య బాబు డప్పు వేయడం గమనార్హం. మొత్తానికి చంద్రబాబును బాలయ్య బాబు గెస్ట్ గా ఆహ్వానించి అన్ స్టాపబుల్ సీజన్2 కూడా సక్సెస్ అయ్యే విధంగా మాస్టర్ ప్లాన్ వేశారు. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య, లోకేశ్ సైతం పలు కీలక విషయాలను పంచుకోవడం గమనార్హం.