అందరికీ విద్య, అందరికీ అందుబాటులో విద్య అన్న నినాదాలు వినటానికి బాగుంటాయి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి నీరుగారి పోతుంది. ఎందుకంటే విద్యా వ్యవస్ధ మొత్తం కొందరు వ్యక్తుల చేతిలో ఇరుక్కుపోయింది కాబట్టి. నిజంగా గడచిన పదేళ్ళుగా ఏపిలో విద్యా మాఫియా ఒకటి వేళ్ళూనుకుపోయింది.
మాఫియా మెడలు వండి విద్యను అందిరికీ చవకగా అందించాలన్న జగన్మోహన్ రెడ్డి ఆలోచన మంచిదే కానీ ఆచరణలో ఉంత వరకూ సాకారమవుతుందన్నదే అనుమానం. రాష్ట్రంలో నారాయణ, శ్రీ చైతన్య, కేశవరెడ్డి, చైతన్య లాంటి విద్యాసంస్ధలు బలంగా పాతుకుపోయాయి. వీటి యాజమాన్యాల్లో అత్యధికం తెలుగుదేశంపార్టీలోనే ఉన్నాయి. కాబట్టి గడచిన ఐదేళ్ళల్లో వీళ్ళంతా ఓ మాఫియా లాగ తయారై విద్యా వ్యవస్ధ మొత్తాన్ని తమ గుప్పిటలో పెట్టుకున్నారు.
వీళ్ళకు చంద్రబాబునాయుడు కూడా మద్దతు పలకటంతో వాళ్ళ దోపిడికి అడ్డే లేకుండా పోయింది. అందుకే స్కూళ్ళల్లోను, కాలేజీల్లోను లక్షలాది ఫీజులు వసూలు చేస్తున్నా చంద్రబాబు చోద్యం చూస్తు కూర్చున్నారు. ఫీజుల విషయంలో విద్యార్ధి సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు ఎంత గోల చేసినా ఉపయోగం కనబడలేదు.
ఈ నేపధ్యంలో జగన్ తాజాగా విద్యావ్యాపారాన్ని నియంత్రించటానికి తీసుకొచ్చిన రెండు చట్టాలతో ఒక్కసారిగా యాజమాన్యాలకు షాక్ తగిలిందనే చెప్పాలి. అయితే చట్టాలు తెచ్చినంతమాత్రాన యాజమాన్యాలు లొంగుతాయని అనుకునేందుకు లేదు. జగన్ నుండి క్రిందస్ధాయి వరకూ అందరికీ చిత్తశుద్ది ఉంటేనే ఫీజులు తగ్గుతాయి. అదే సమయంలో ప్రభుత్వ స్కూళ్ళల్లో సామర్ధ్యాన్ని పెంచితే ఆటోమేటిక్ గా ప్రైవేటు విద్యాసంస్ధలకు ముకుతాడు పడుతుందనటంలో సందేహం లేదు.
