బిటెక్ చదివింది.. పల్లె సేవకు సర్పంచ్ గా బరిలోకి దిగింది

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి గ్రామ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో ఆరుగురు మహిళలు పోటిలో నిలిచారు. అందులో వెల్మల సమత కూడా బరిలో ఉంది. సమత బిటెక్ కంప్యూటర్స్ కోర్సు చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కూడా పని చేసింది. రెండేళ్ల క్రితం నుంచి  భర్త నవీన్ రెడ్డితో కలిసి జగిత్యాలలో ప్రైవేట్ పాఠశాల నడుపుతున్నారు.   సర్పంచ్ ఎన్నికల రిజర్వ్ కలిసి రావడంతో ప్రజా సేవ చేయాలని సమత ముందుకు కదిలారు.

ప్రజలకు తాను గెలిస్తే చేయబోయే పనుల గురించి తెలుపుతూ ఇప్పటికే మ్యానిఫేస్టో ప్రకటించారు. మేడిపల్లి మండలంలో అన్ని గ్రామాలకు కలిపి నామినేషన్ వేసిన వారిలో సమతనే ఉన్నత చదువురాలు. దీంతో గ్రామంలో కూడా సమత సేవా గుణాన్ని చూసి అంతా ఆమెకు మద్దతు పలుకుతున్నారు.