టీడీపీ కి బిగ్ షాక్ .. అచ్చెన్నాయుడు, రామానాయుడులకి నోటీసులు !

టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుకు వారం రోజుల్లో నోటీసులు ఇవ్వాలని ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. కొద్దిసేపటి క్రితం సమావేశమైన ఈ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో టీ అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుకు ముందుగా నోటీసులు ఇవ్వాలని కమిటీ ఇవ్వాలని నిర్ణయించింది.

greater election campaign of tdp to start with lokesh babu
 

సభ నియమాల ప్రకారమే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని కమిటీ స్పష్టం చేసింది. స్పీకర్ రిఫర్ చేసిన కారణంగా మొదట అచ్చెన్నాయుడి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన కమిటీ… చీఫ్ విప్ సభలో తీర్మానం చేసిన ప్రకారం నిమ్మల రామానాయుడికి నోటీసులు ఇవ్వనుంది.

ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన అనంతరం పదిరోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో కమిటీ తెలపనుంది. ఇక గతంలో టీడీపీ ఇచ్చిన సభ హక్కుల నోటీసులపై కమిటీలో చర్చ జరగలేదు. సరైన ఫార్మాట్ లేని కారణంగా వీటిపై చర్చ జరపలేమని కమిటీ స్పష్టం చేసింది. ఇక ప్రివిలేజ్ కమిటీ తదుపరి సమావేశం వచ్చే ఏడాది జనవరి 18 లేదా 19 తేదీల్లో తిరుపతిలో జరగనుంది