బాలయ్యా.! ఇంత కామెడీ చేశావేంటయ్యా.?

బావ చంద్రబాబు అరెస్టయి, జైలుకు వెళ్ళడంతో.. టీడీపీ కార్యాలయంలో ఒకింత ఘనమైన హోదాతో సమీక్షలు నిర్వహించడానికి ఆస్కారమేర్పడింది, చంద్రబాబు బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి.!

ఈ క్రమంలో బాలకృష్ణ, మీడియాతోనూ మాట్లాడారు. కాదు కాదు, కామెడీ చేశారు. నాటకీయంగా ‘అర్భక..’ అంటూ వైఎస్ జగన్ పేరుని ప్రస్తావించారు. త్వరలో పరామర్శ యాత్ర కూడా చేస్తానని బాలకృష్ణ చెప్పడం గమనార్హం. ఎందుకు ఈ పరామర్శ యాత్ర.? అంటే, ఇంకెందుకు.. చంద్రబాబు అరెస్టుని జీర్ణించుకోలేక అప్పుడే 22 గుండెలు ఆగిపోయాయట.! ఆ కుటుంబాల్ని బాలయ్య పరామర్శిస్తారట.

ఇదో కొత్త డ్రామా.! అంతే, రాజకీయాల్లో అంతే.! గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడూ ఇదే జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా అంతే.! అదేంటో, రాజకీయ నాయకుల ఇళ్ళల్లోని వారికి, తమ కుటుంబ సభ్యుడి విషయంలో గుండె పోట్లు రావు.! సామాన్యులకే వస్తాయ్.!

అభిమానం వుంటుంది.. అభిమానుల మనసులూ గాయపడతాయ్.! కానీ, చచ్చిపోయేంతలాగానా.? అన్నది ఓ పెద్ద డౌటు.! అదీ ఈ రోజుల్లో.. కష్టసాధ్యమే.! సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే, ఏనాడన్నా బాలకృష్ణకి పార్టీ కార్యక్రమాల్లో సరైన గౌరవం చంద్రబాబు కల్పించారా.? లేదే.!

హిందూపురం ఎమ్మెల్యే మాత్రమే.. అంతకు మించి, టీడీపీలో నందమూరి బాలకృష్ణకి సరైన గుర్తింపే లేదు. ఇప్పుడు బాలయ్య హడావిడిగా వచ్చేసి, వైఎస్ జగన్ మీద విమర్శలు చేసేస్తే, టీడీపీ నాయకులు ఆయన్ని గౌరవిస్తారా.? టీడీపీ అను‘కుల’ మీడియాకి తప్పదు, బాలయ్యను మోసేస్తుంది.! మోసెయ్యాలి కూడా.!

కానీ, మిగతావాళ్ళకి బాలయ్య తీరు.. పెద్ద కామెడీ అయిపోయింది.